మన టాలీవుడ్ ఎవర్ గ్రీన్ మన్మథుడు కింగ్ నాగార్జున హీరోగా నటించిన చిత్రాల్లో రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ హిట్ చిత్రం ‘చంద్రలేఖ’ కూడా ఒకటి. మరి ఈ చిత్రంలో హీరోయిన్స్ గా రమ్యకృష్ణ, ఇషా కొప్పికర్ లు నటించారు. అయితే వీరిలో ఇషా చేసిన లేటెస్ట్ కామెంట్స్ వైరల్ గా మారాయి. ఈ సినిమా చేస్తున్నప్పుడు నాగార్జునతో తాను 15 సార్లు చెంప దెబ్బలు తిన్నట్టుగా తెలిపారు.
అయితే దీని వెనుక ఉన్న కథ ఏంటంటే ఈ సినిమాలో నాగార్జున ఆమెని కొట్టే సన్నివేశం ఒకటి ఉంటుంది. అయితే ఈ సినిమా అప్పటికి ఆమెకి రెండో సినిమానే సో ఆ సీన్ లో తనకి ఎలాంటి ఫీల్ కలగడం లేదని అందుకే నిజంగా కొట్టమని తానే నాగ్ ని అడిగినట్టు చెప్పారు.
అందుకు నాగ్ నిజంగానేనా అని అడిగారు నేను నిజంగానే అని చెప్పాను కానీ మొదట సాఫ్ట్ గానే కొట్టారు అదీ సరిపోకపోయేసరికి నిజంగా చెంపదెబ్బలు 15 సార్లు తినాల్సి వచ్చింది అని తెలిపింది. అయితే ఈ టేక్స్ తర్వాత నాగార్జున ఆమెకి సారీ కూడా చెప్పారని ఆమె తెలిపింది. అయితే అన్ని సార్లు దెబ్బలు తిన్నాక ఆమె బుగ్గపై మచ్చలు పడిపోయాయట. ఏది ఏమైనప్పటికీ ఈ షాకింగ్ అంశం ఇపుడు సినీ వర్గాల్లో సహా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.