ఐపీఎల్ 2025లో భాగంగా జరిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్లో ఢిల్లీ విజయాన్ని అందుకుంది. టాస్ గెలిచిన డీసీ బౌలింగ్ ఎంచుకోవడంతో ఆర్సీబీ బ్యాటింగ్కు వచ్చింది. ఓపెనర్లు ఫిల్ సాల్ట్(37), విరాట్ కోహ్లీ(22) త్వరగా ఔట్ కావడం.. మిడిలార్డర్ బ్యాట్స్మెన్లు కూడా పెద్దగా రాణించకపోవడంతో ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది.
ఇక 164 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్కు వచ్చిన డీసీ ఓపెనర్లు వెంటవెంటనే ఔట్ అయ్యారు. కానీ, మిడిలార్డర్లో వచ్చిన కెఎల్ రాహుల్(93 నాటౌట్), ట్రిస్టన్ స్టబ్స్(38 నాటౌట్)తో మ్యాచ్ను తమ భుజాలపై వేసుకుని విజయాన్ని అందించారు. 17.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయిన ఢిల్లీ క్యాపిటల్స్ 169 పరుగులు సాధించి ఆర్సీబీపై 6 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది.