సాంగ్ ను రిలీజ్ చేసిన సైబరాబాద్ పోలీస్ కమీషనర్ !

సాంగ్ ను రిలీజ్ చేసిన సైబరాబాద్ పోలీస్ కమీషనర్ !

Published on Aug 16, 2020 5:26 PM IST

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఐ యామ్ యాన్ ఇండియన్ సాంగ్ ను రిలీజ్ చేసారు సైబరాబాద్ పోలీస్ కమీషనర్ వీ.సీ. సజ్జనార్, నిర్మాత చిల్లర కళ్యాణ్, నటుడు ఆలీ. గచ్చిబౌలి లోని సైబరాబాద్ పోలీస్ కమీషనరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో S 5 సినిమాలోని ఈ పాటను ఆవిష్కరించారు… ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశం కోసం, దేశ భద్రత మరియు అభివృద్ధి కోసం అందరం కృషి చేయాలని కోరారు. సమాజం మనకు ఏమీ చేసింది అనేది కాకుండా మనం సమాజం కోసం, దేశం కోసం ఏమీ చేశామన్నదే ముఖ్యమనే అబ్రహం లింకన్ మాటలను గుర్తు చేసుకున్నారు.

S 5 సినిమా లో ఐ యామ్ యాన్ ఇండియన్ పాట పాడిన సింగర్ శ్రీరామ చంద్ర, S 5 సినిమా డైరెక్టర్ సన్నీ లతో పాటు సినిమా కు పనిచేసిన అందరికీ అభినందనలు తెలియజేశారు. రాబోయే గణేష్ ఉత్సవాలలో ఎంపీ సంతోష్ కుమార్ పిలుపు మేరకు ప్రతి ఒక్కరూ సీడ్ గణేష్ ను నెలకొల్పి పర్యావరణాన్ని కాపాడాలని కోరారు. కరోనా మహమ్మారి విజృంబిస్తున్న తరుణంలో ప్లాస్మా డోనేషన్ చాల ముఖ్యమైనదని, కాబట్టి ప్రతి సినీ హిరో అభిమానులు ప్లాస్మా డోనేషన్ కు ముందుకు రావాలని పిలుపు నిచ్చారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు