తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘కూలీ’ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సినిమాను దర్శకుడు లోకేష్ కనగరాజ్ డైరెక్ట్ చేస్తుండటంతో ఈ మూవీపై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, వీడియో గ్లింప్స్ ప్రేక్షకుల్లో అంచనాలను రెట్టింపు చేశాయి.
కాగా, ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్లో అందాల భామ పూజా హెగ్డే స్టెప్పులు వేయనుంది. సిజ్లింగ్ సాంగ్గా రానున్న ఈ డ్యాన్స్ నెంబర్లో పూజా తన గ్లామర్తో ప్రేక్షకులును ఆకట్టుకోనుంది. అయితే, ఈ సాంగ్ కోసం పూజా హెగ్డే భారీ మొత్తంలో రెమ్యునరేషన్ తీసుకున్నట్లు కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఒక్క స్పెషల్ సాంగ్లో నటించేందుకు ఆమె ఏకంగా రూ.2 కోట్ల మేర రెమ్యునరేషన్ తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
గ్లామర్ షోతో పాటు సాలిడ్ స్టెప్పులు వేయడంలో పూజా పర్ఫెక్ట్ కాబట్టి, ఆమె కోరినంత పేమెంట్ ఇవ్వడానికి నిర్మాతలు కూడా ఓకే చెప్పారట. తెలుగు, తమిళ్లో పెద్దగా అవకాశాలు లేని పూజా కేవలం ఓ స్పెషల్ సాంగ్ కోసం భారీగా డిమాండ్ చేయడం ప్రస్తుతం కోలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది.