దర్శకుడు బోయపాటి శ్రీను మాస్ మసాలా సినిమాలకు ప్రసిద్ధి. ఆయన సినిమాలో భారీ స్థాయిలో యాక్షన్ ఎపిసోడ్ లను, భీభత్సమైన రౌద్ర రసాన్ని ఆశించవచ్చు. అదే కోవలో ప్రస్తుతం బాలకృష్ణతో కలిసి ‘లెజెండ్’గా మరోసారి విజయం సాధించారు. కానీ బోయపాటి ఇక ఆ ఇమేజ్ నుండి బయటకు రావాలని అనుకుంటున్నాడు
తాజా సమాచారం ప్రకారం రామ్ చరణ్ తో తీయనున్న తన తదుపరి సినిమాను రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తీయాలని భావిస్తున్నాడట. ఈ సినిమాలో కామెడీ, రొమాన్స్ లకు అధిక ప్రాధాన్యం వుండనుంది అని అంటున్నారు
ఈ సినిమాను దుర్గ ఆర్ట్స్ బ్యానర్ పై కె.ఎల్ నారాయణ నిర్మిస్తున్నారు