మళ్లీ వాయిదా పడిన అధినాయకుడు?

మళ్లీ వాయిదా పడిన అధినాయకుడు?

Published on Dec 30, 2011 11:18 AM IST


ఫిలిం నగర్ వర్గాల తాజా సమాచారం ప్రకారం బాలకృష్ణ నటిస్తున్న ‘అధినాయకుడు’ చిత్రం ఫిబ్రవరికి వాయిదా పడింది. ఈ చిత్రం సంక్రాంతికి విడుదల కావాల్సి ఉండగా ఫిబ్రవరికి వాయిదా పడినట్లు విశ్వనీయవర్గాల సమాచారం. నిర్మాతలు మాత్రం ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. అధినాయకుడు చిత్రంలో బాలకృష్ణ సరసన లక్ష్మి రాయ్ మరియు సలోని నటిస్తున్నారు.
ఈ చిత్రం పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతుంది. బాలకృష్ణ మూడు విభిన్నమైన పాత్రల్లో నటిస్తున్నట్లు సమాచారం. అధినాయకుడు చిత్రాన్ని పరుచూరి మురళి డైరెక్ట్ చేస్తుండగా ఎమ్.ఎల్ కుమార్ చౌదరి నిర్మిస్తున్నారు. కళ్యాణి మాలిక్ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు