గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం ఫుల్ ఫామ్లో ఉన్నాడు. వరుసగా నాలుగు సినిమాలు బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ కావడంతో ఆయన నెక్స్ట్ చిత్రం కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక బాలయ్యకు ఇటీవల కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డును కూడా ప్రదానం చేయడంతో అభిమానుల సంతోషం మరింత పెరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో బాలయ్య కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
తన సినీ కెరీర్లో 50 ఏళ్లుగా హీరోగా నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టకుంటున్నానని.. ఇలాంటి ఫీట్ టాలీవుడ్లో ఎవరూ చేయలేదని ఆయన అన్నారు. అయితే, తన కెరీర్లో ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ సూపర్బ్గా సాగుతుందని.. ఇప్పటికే వరుసగా నాలుగు బ్యాక్ టు బ్యాక్ సినిమాలు బ్లాక్బస్టర్ అయ్యాయని.. ఇకపై తన స్క్రిప్ట్ సెలక్షన్ ప్రేక్షకుల ఊహకు అందకుండా ఉంటుందని ఆయన అన్నారు.
తన కథల ఎంపికతో ప్రేక్షకులను ఇంప్రెస్ చేస్తానని బాలయ్య ధీమాగా చెప్పాడు. ఇక బాలయ్య ప్రస్తుతం అఖండ 2 చిత్రంతో బిజీగా ఉన్నాడు. ఆయన గతంలో నటించిన ‘ఆదిత్య 369’ కి ఎప్పటికైనా సీక్వెల్ తానే స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తానని బాలయ్య తెలిపాడు. దీంతో బాలయ్య తన నెక్స్ట్ చిత్రాలకు ఎలాంటి కథలను ఓకే చేస్తాడా అనే ఆసక్తి అందరిలో నెలకొంది.