మహేష్ బ్యానర్ లో మళ్ళీ అదే హీరో ?

మహేష్ బ్యానర్ లో మళ్ళీ అదే హీరో ?

Published on Aug 22, 2020 10:00 AM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు థియేటర్స్ బిజినెస్ తో పాటు ఎంబీ ప్రొడక్షన్స్ అనే పేరుతో మూవీ ప్రొడక్షన్ కూడా చేశాడు. ఇప్పటికే అడవి శేష్ హీరోగా వస్తోన్న ‘మేజర్’ సినిమా చేస్తున్నాడు. ఇప్పుడు అడవి శేష్ తోనే మరో సినిమాని నిర్మించడానికి ప్లాన్ చేస్తున్నాడట. పైగా ‘మహర్షి’ డైరెక్టర్ వంశీ పైడిపల్లి ఈ సినిమాకి కథ అందిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరి ఈ వార్తలో ఎంత నిజం ఉందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకూ ఆగాల్సిందే.

ఇక వంశీ పైడిపల్లి తన తరువాత సినిమాని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో ప్లాన్ చేస్తున్నాడని రూమర్స్ వచ్చాయి. అయితే మహేశ్ తో వంశీకి సానిహిత్యం కారణంగా అడవి శేష్ సినిమాకి కథ ఇవ్వడానికి ఒప్పుకున్నాడట. ఇక అడవి శేష్ హీరోగా వస్తోన్న ‘మేజర్’ సినిమాని సోనీ పిక్చర్స్ మరియు ఎప్లస్ఎస్ మూవీస్ వారితో కలిసి మహేష్ బాబు నిర్మిస్తున్నాడు. ముంబై టెర్రర్ అటాక్ లో వీరమరణం పొందిన ఉన్ని కృష్ణన్ జీవిత కథ ఆధారంగా ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమా చాలా భాగం షూటింగ్ కూడా పూర్తి చేసుకుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు