మేరీ కృపావతి ప్రభుదాస్ సమర్పణలో కొమరపు ప్రొడక్షన్స్ పతాకంపై ఆదిత్య ఓం ,అరుణ్ రాహుల్, అంజనా శ్రీనివాస్ , రోహిణి ముంజల్, సుమన్ , జయప్రకాష్ రెడ్డి ,పోసాని కృష్ణ మురళి, చలపతి రాజు, కవిత నటీ నటులుగా కట్ల రాజేంద్రప్రసాద్ దర్శకత్వంలో కే జోషఫ్ నిర్మించిన “చేతిలో చెయ్యేసి చెప్పు బావ” చిత్రం విడుదలై విజయవంతంగా ప్రదర్శింపబడుతున్న సందర్భంగా చిత్ర యూనిట్ సుమన్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి విజయోత్సవ వేడుకలు జరుపుకున్నారు..
అనంతరం సుమన్ మాట్లాడుతూ… ఈ సంవత్సరం లో వచ్చిన చిన్న సినిమాల సక్సెస్ లో ఈ సినిమా ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది. పెద్ద క్యాస్టింగ్ లేకపోయినా మంచి కథ ఉంటే ప్రేక్షకుల ఎప్పుడు ఆదరిస్తారని ఈ మూవీ ప్రూవ్ చేసింది.దర్శకుడు ప్రసాద్ వచ్చి నాకు కథ చెప్పినపుడు డిఫ్రెంట్ గా ఉందని ఒప్పుకున్నాను నాకు దర్శకుడు ప్రసాద్ డ్యాన్సర్ గా, డ్యాన్స్ అసిస్టెంట్ గా, డ్యాన్స్ డైరెక్టర్ గా , ఒక డైరెక్టర్ గా అప్పటినుండి తెలుసు ఆయన లైఫ్ లో ఎన్నో కష్టాలు పడ్డాడు. ప్రసాద్ నిర్మాతలకు ఫ్లెక్సిబుల్ గా ఉంటాడు. అలా నిర్మాత ఇచ్చిన కథను మార్పులు చేసి ఈ రోజు డైరెక్టర్ గా మంచి సినిమా తీసి సక్సెస్ సాధించాడు. ఇలాగే ప్రసాద్ ముందు ముందు పెద్ద హీరోలతో సినిమాలు తీసి విజయం సాధించాలని కోరుకుంటున్నాను. నిర్మాత జోషఫ్ తను తీసిన మొదటి సినిమాతోనే సక్సెస్ సాధించాడు. ఇలాంటి మంచి నిర్మాతలు ఇండస్ట్రీ కి కావాలి. ముందు ముందు మీరే దర్శకులకు మంచి కథలు ఇచ్చి ఎన్నో సినిమాలు తియ్యాలని కోరుకుంటున్నాను. ఈ సినిమా విషయం లో మీ బాధ నాకు అర్థమయ్యింది. జనరల్ గా పెద్ద సినిమాల మధ్యలో చిన్న సినిమాలు విడుదలైనపుడు థియేటర్ల సమస్య వస్తుంది.
సినిమా బాగున్నా.. థియేటర్స్ దొరక్క సినిమాలో నటించిన అరిస్టులకు తగిన గుర్తింపు రాకపోవడంతో పాటు దర్శక, నిర్మాత లు ఎంతో నష్టపోతారు. ఈ విషయంపై నేను మన ముఖ్యమంత్రులు కె. సి.ఆర్ ,జగన్ గార్లకు చెప్పడం జరిగింది. చిన్న సినిమాలు , చిన్న నిర్మాతలు చాలా సఫర్ అవుతున్నారని, చిన్న సినిమాలకు మంచి టాక్ వచ్చి సెట్ అయ్యే టైంలో పెద్ద సినిమాలను దృష్టిలో పెట్టుకొని చిన్న సినిమాలను మూడు రోజుల్లోనే తీసి వేస్తున్నారని అలా కాకుండా ఫైనాన్స్ పరంగా టాక్స్ పరంగా చిన్న సినిమాలకు కొత్త సిస్టం ను ఫామ్ చేసి ఒక వారం ఉండేలా చూసి చిన్న సినిమాలను, చిన్న నిర్మాతలను కాపాడాలని వారికి చెప్పడం జరిగింది. త్వరలో దీనికి తగిన పరిస్కారం లభించాలని ఆశిస్తున్నాను. అలాగే ఇండస్ట్రీ లో ఏదైనా విజయం సాధించాలంటే కష్టంతో పాటు అదృష్టం కూడా ఉండాలి. ఎప్పుడు ఏ సినిమా హిట్ అవుతుందో చెప్పలేము.ఇండస్ట్రీ లో కస్టపడే వారికి ఎప్పటికైనా మంచి విజయం లభిస్తుంది. నేను ఇండస్ట్రీ కు ఎలాంటి బ్యాగ్రౌండ్ తో రాలేదు.ఇండస్ట్రీ లో నాకు ఎలాంటి గాడ్ ఫాదర్ లేడు. నేను ఇండస్ట్రీ కు వచ్చి 43 సంవత్సరాలు అయ్యింది. ఇప్పటి వరకు నేను 9 భాషలో 500 సినిమాల పైనే చేశాను. నేనెప్పుడూ నిర్మాతకు కష్టం కలిగించే పని చేయను, నాకిచ్చిన షెడ్యూల్ ను పూర్తి చేరుకొని వెళతాను. సినిమా హిట్ అయినా, ఫెయిల్ అయినా ఒకేలా ఉండాలి. ఒక నిర్మాతకు, దర్శకుడికి, నటుడికి సినిమా హిట్ అయితే వచ్చే సంతోషమే వేరు అలాంటి మంచి సినిమా తో మన ముందుకు వచ్చిన దర్శక, నిర్మాతలను ప్రేక్షకులు ఆదరించి “చేతిలో చెయ్యేసి చెప్పు బావ” చిత్రాన్ని ఇంకా పెద్ద విజయం సాధించేలా చెయ్యాలని అన్నారు.
చిత్ర నిర్మాత కోమరపు జోషఫ్ మాట్లాడుతూ.. బిజినెస్ చేస్తున్న నాకు సినిమా చేయమని మా ఫ్రెండ్స్ ప్రోత్సహించడంతో కొంతమంది డైరెక్టర్లతో కథలు వినడం జరిగింది కానీ ఆ కథలు నచ్చక చివరికి నేనే కథ రాసుకొని “చెయ్యేసి చెప్పు బావా” టైటిల్ కూడా పెట్టుకున్నాను. అయితే నేను రాసిన కథకు లిరిక్స్, పాటలు కావాలని మంచి డైరెక్టర్ కోసం ఎదురు చూస్తున్న క్రమంలో మా ఫ్రెండు ద్వారా కట్ల రాజేంద్రప్రసాద్ ను పరిచయం చేయడం జరిగింది. సీనియర్ పర్సన్ దగ్గర మనం సినిమా తీయాలంటే బడ్జెట్ సరిపోదని చెప్పడంతో అదేం లేదు ఆయన ఆల్ రౌండర్ కొరియోగ్రాఫర్, డైరెక్టర్ , ఫైటర్, కెమెరామెన్ ఇలా అన్ని చేయగలుగుతారని చెప్పడంతో మేము కథ కోసం డిస్కషన్ చేసుకున్నా క్రమంలో నా కథ చెప్పడంతో ఆ కథకు మాటలు పాటలు చేయమని చెప్పడం జరిగింది దాంతో డైరెక్టర్ వన్ మంత్ టైమ్ తీసుకుని డైలాగ్స్ లిరిక్స్ రెడీ చేసుకుని వచ్చి మూవీని షూట్ చేద్దామని అనుకున్నాం అయితే నా బర్త్ డే జనవరి 26 రోజున ఉన్నందున నా బర్త్డే రోజు అన్నపూర్ణ స్టూడియో ఓపెన్ చేయడం సినిమా ఓపెనింగ్ చేయడం జరిగింది .ఆ తరువాత మంచి ప్యాడ్ ఇన్ రెడీ చేసుకొని మా ఫ్రెండు ఊరు చేగుంటలో సూట్ స్టార్ట్ చేసుకుని సుమారు 52 రోజులలో షూటింగ్ కంప్లీట్ చేయడం జరిగింది. లాస్ట్ ఇయర్ మార్చి 25 కు ఈ మూవీని విడుదల చేద్దాం అనుకున్న టైంకు కోవిడ్ రావడంతో సినిమా విడుదల ఆగిపోయింది. తర్వాత ఓ.టి.టి. ఫ్లాట్ ఫామ్స్ లలో విడుదల చేయమని చాలామంది అడిగినా ఈ సినిమాను థియేటర్లోనే విడుదల చేస్తానని చెప్పడం జరిగింది..గత నెల జనవరి 26 నా బర్త్ డే రోజు ఫిబ్రవరి 5 న సినిమాను రిలీజ్ చేస్తామని చెప్పడం జరిగింది.చెప్పిన ప్రకారం ఫిబ్రవరి 5 న సినిమా రిలీజ్ చేయడం జరిగింది ఈ సినిమా విడుదలైన అన్ని థియేటర్లలో విజయవంతంగా నడుస్తుంది. చిన్న సినిమాలకు కూడా గవర్నమెంటు రాయితీ ఇచ్చి మరిన్ని థియేటర్స్ లలో అవకాశం కల్పిస్తే చిన్న సినిమాలను ఆదుకున్న వారవుతారు.మా చిత్రానికి అన్ని చోట్లా నుండి మంచి రెస్పాన్స్ వస్తుంది.ఈ సినిమా టైటిల్ వలన నాకు చాలా మంచి పేరు వచ్చింది అందరికీ ఈ సినిమా తప్పకుండా నచ్చుతుంది అని అన్నారు.
చిత్ర దర్శకుడు కట్ల రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ.. ఈ చిత్రానికి డైరెక్షన్ చేయడానికి ముఖ్య కారణం చలపతి రాజుగారు,ఇంత మంచి బ్యానర్ ను నిర్మాతను ,ఫ్యామిలిని కల్పించారు. అలాంటి వారి ఋణం ఎలా తీర్చుకోవాలని ఆలోచించి జోషఫ్ గారు ఇచ్చిన కథలో చిన్న మార్పు చేసి ఈ సినిమాలో విలన్ పాత్ర ఇవ్వడం జరిగింది. మేము అనుకున్న దాని కంటే బాగా నటించాడు. తెలుగు ఇండస్ట్రీ లో విలన్ కొరత ఉంది ఈ సినిమాతో మనకు మంచి విలన్ దొరికాడు. అలాగే నిర్మాత గారు నేను ఏ అరిస్టు కావాలంటే ఆ ఆర్టిస్ట్ ను ఇచ్చారు ఇలా ఈ సినిమాలో 18 మంది పెద్ద ఆర్టిస్టులను తీసుకోవడం జరిగింది. నాకు ఎక్కడ షూటింగ్ కావాలంటే అక్కడ ఖర్చుకు వెనకడకుండా ఏర్పాటు చేశారు.నేను ఇప్పటి వరకు ఎనిమిది సినిమాలకు డైరెక్టర్ గా పని చేశాను. నేను చేసిన ప్రొడ్యూసర్ లందరి కంటే జోషఫ్ గారు ది బెస్ట్ ప్రొడ్యూసర్. ఎందుకంటే చాలామంది మేము చేస్తున్న డైరెక్షన్ లో మార్పులు చేయమంటారు కానీ జోషఫ్ గారు నాకు ఫ్రీడమ్ ఇవ్వడం తో ఈ రోజు ఈ సినిమా ప్రేక్షకాదరణ పొందుతుంది. సినిమా విడుదల సమయంలో నిర్మాత చాలా కష్టపడ్డాడు. ఈ విజయానికి దోహదపడిన ప్రతి ఒక్కరికీ నా ధన్యవాదాలు. ఈ సినిమా చాలా బాగుంది దయచేసి మా సినిమాను ఒక్కసారి చూడండి మీ అందరికీ తప్పకుండా నచ్చుతుందని అన్నారు.