మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో “మన శంకర వరప్రసాద్ గారు” అనే ఫుల్ కామెడీ ఎంటర్ టైనర్ రాబోతుంది. ఈ సినిమాలో మరో హీరో వెంకటేష్ కనిపించబోతున్న సంగతి తెలిసిందే. ముగింపు దశలో ఉన్న ఈ సినిమా ఆదివారం నుంచి హైదరాబాద్లో క్లైమాక్స్ యాక్షన్ సీక్వెన్స్ను ప్రారంభించుకుంది. మెగాస్టార్ తో పాటు ఫైటర్స్ బృందంపై తెరకెక్కిస్తున్న ఈ భారీ పోరాట ఘట్టానికి యాక్షన్ కొరియోగ్రాఫర్ వెంకట్ నేతృత్వం వహిస్తున్నారు.
కాగా ఈ క్లైమాక్స్ యాక్షన్ సీక్వెన్స్ ప్రేక్షకులకు మరిచిపోలేని అనుభూతిని అందిస్తుందని టీమ్ చెబుతుంది. ఈ సినిమా గురించి మెగాస్టార్ ఆ మధ్య మాట్లాడుతూ.. ‘ఈ సినిమా పూర్తిస్థాయి వినోదాత్మక చిత్రమని.. ఈ సినిమా కచ్చితంగా అభిమానులకు నచ్చుతుంది’ అని మెగాస్టార్ చిరంజీవి తెలిపారు. ఇక సాహు గారపాటి, సుస్మిత (చిరంజీవి కుమార్తె) సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తారని చిరు తెలిపారు. ఈ సినిమాలో నయనతార కథానాయికగా నటిస్తోంది.


