నాగార్జున, ధనుష్, రష్మిక ప్రధాన పాత్రల్లో ‘కుబేర’ ఈ నెల 20న రిలీజ్ కాబోతుంది. సినిమా పై మంచి బజ్ ఉంది. పైగా ట్రైలర్ కూడా జనంలోకి బాగా వెళ్లింది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ లో రష్మిక మాట్లాడిన మాటలు ప్రస్తుతం వైరల్ గా మారాయి. రష్మిక మాట్లాడుతూ.. ‘నా సినీ ప్రయాణానికి సంబంధించి ఇక్కడ ప్రదర్శించిన వీడియో చూస్తే భయమేసింది. ఇన్ని రోల్స్ ప్లే చేశానా ? అనే ఆశ్చర్యం కలిగింది. సాధారణంగా ఒక సినిమా పూర్తవడానికి ఏడాది పడుతుంది. ఆ సమయంలో చిత్ర బృందంతో క్లోజ్ అవుతుంటాం. నేను నా ఫ్యామిలీని కలిసి ఏడాది అయింది’ అంటూ రష్మిక చెప్పింది.
రష్మిక ఇంకా మాట్లాడుతూ.. ‘శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నటించాలన్న కల ఈ సినిమాతో నెరవేరింది. రియల్ లొకేషన్స్లోనే ఆయన షూటింగ్ చేస్తారు. నాగార్జున సర్తో నేను నటించిన రెండో చిత్రమిది. ఆయన మంచి నటుడే కాదు మంచి వ్యక్తి. ధనుష్తో కలిసి మరిన్ని సినిమాల్లో నటించాలనుంది. ఈ చిత్రంలోని మా కెమిస్ట్రీ ఆ అవకాశాలు అందిస్తుందనుకుంటున్నా’ అని రష్మిక తెలిపింది. మొత్తానికి ఈ సినిమాలో రష్మిక బలమైన పాత్రలో కనిపించిందట. ఆమె పాత్ర ఎమోషనల్ గానూ ఆకట్టుకుంటుందట.