టాలీవుడ్లో తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ చిత్రాల్లో హీరో మంచు విష్ణు నటిస్తున్న చిత్రం ‘కన్నప్ప’ ఇప్పటికే ప్రేక్షకుల్లో సాలిడ్ అంచనాలు క్రియేట్ చేసింది. ఈ సినిమాను దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ డైరెక్ట్ చేయగా, పూర్తి మైథలాజికల్ చిత్రంగా ఈ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు రెడీ అయింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ ఈ మూవీపై అంచనాలను రెట్టింపు చేశాయి.
అయితే, ఈ సినిమా రిలీజ్కు మరింత చేరువ కావడంతో ఈ చిత్రానికి ఇప్పుడు సెన్సార్ కష్టాలు వస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో బ్రాహ్మణ వర్గానికి సంబంధించిన పాత్రలపై బ్రాహ్మణ చైతన్య వేదిక తీవ్ర అభ్యంతరాలు చెప్పిందట. దీంతో సెన్సార్ బోర్డు కూడా ఈ విషయంపై సినిమాను చూసిన తర్వాత తమ నిర్ణయాన్ని వెల్లడిస్తామని తెలిపింది. ఇక ఈ సినిమాను చూసిన మంది సెన్సార్ బోర్డు సభ్యులు సినిమాలోని 13 సీన్స్పై అభ్యంతరం తెలిపారట.
ఈ సీన్స్ను తొలగించాలని వారు కన్నప్ప చిత్ర యూనిట్కు సూచించినట్లు తెలుస్తోంది. మరి ఈ విషయంపై చిత్ర యూనిట్ ఎలా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఇక జూన్ 27న గ్రాండ్ రిలీజ్కు రెడీ అయిన ఈ సినిమాను మోహన్ బాబు భారీ బడ్జెట్తో ప్రొడ్యూస్ చేస్తున్నారు.