అసెంబ్లీ సీన్స్ ప్లాన్ చేస్తోన్న ‘తలైవి’ !

అసెంబ్లీ సీన్స్ ప్లాన్ చేస్తోన్న ‘తలైవి’ !

Published on Sep 13, 2020 12:00 AM IST

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితగారి జీవితం ఆధారంగా ‘తలైవి’ అనే బయోపిక్ ను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. కాగా నవంబర్ లో ప్లాన్ చేస్తోన్న షెడ్యూల్ లో ప్రకాష్ రాజ్ మరియు కంగనా మీద అసెంబ్లీ సన్నివేశాలను షూట్ చేయనున్నారు. జయలలిత జీవితంలోని ముఖ్యమైన ఘట్టాలలో అసెంబ్లీలో ఆమె పై జరిగిన దాడి ఒకటి. చెన్నైలోని ఓ స్టూడియోలో నిర్మించిన అసెంబ్లీ సెట్ లో వచ్చే నెల్ 11వ తేదీ నుండి షూట్ జరగనుంది.

కాగా జయలలిత లాంటి బలమైన వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించాలంటే కంగనా రనౌత్ లాంటి నటి అయితేనే ఆ పాత్రకు పూర్తి న్యాయం జరుగుతుందనే ఉద్దేశ్యంతో కంగనాను తీసుకున్నారు. మరి ఎప్పుడూ వివాదాస్పద విషయాలతో తన ఘాటైన వ్యాఖ్యలతో ఎప్పుడూ వార్తల్లో నిలిచే కంగనా రనౌత్‌ జయలలిత పాత్రను ఎలా మెప్పిస్తోందో చూడాలి. బాహుబలి రైటర్ విజయేంద్ర ప్రసాద్ రాసిన కథతో తెరకెక్కుతున్న ఈ సినిమా తమిళంతో పాటు తెలుగు, హిందీ భాషల్లో కూడా విడుదలకానుంది. ఈ బయోపిక్ లో మిగిలిన కీలకమైన పాత్రలు ఎం.జి.రామచంద్రన్ మరియు కరుణానిధి పాత్రలు. ఎం.జి.రామచంద్రన్ పాత్రలో అరవింద్‌ స్వామి నటించబోతున్నారు.

తాజా వార్తలు