మన టాలీవుడ్లో ఒక సినిమా హిట్ అయితే తమ తర్వాతి సినిమాలకు అదే విధంగా పేర్లు పెట్టడం, హిట్ అయిన సినిమా తీసిన ఏరియాలోనే మళ్ళీ సినిమా తీయడం ఇలా రకరకాల సెంటిమెంట్స్ ఫాలో అవుతుంటారు. ఈ సెంటిమెంట్ ని హీరోలు, దర్శకులు మరియు నిర్మాతలు అని తేడా లేకుండా అందరూ ఫాలో అవుతున్నారు. తాజాగా ఇందులో డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కూడా చేరారు. ఆయన మహేష్ బాబు తో తీసిన ‘బిజినెస్ మేన్’ సినిమాని నర్సీ పట్నంలో చూసారు. ఆప్పుడు ఆ సినిమా భారీ హిట్ అయ్యింది. ప్రస్తుతం ఆయన ఇదే సెంటిమెంట్ ని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో తీసిన ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ సినిమాకి కూడా ఫాలో అవుతున్నారు. ఈ సినిమా రేపు ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. పూరి ఈ సినిమాని రేపు నర్సీ పట్నంలో ప్రేక్షకులతో కలిసి చూడనున్నారు. అందుకోసం ఆయన నర్సీ పట్నం బయలుదేరారు. ఈ సినిమా పై పూర్తి నమ్మకంతో ఉన్న పూరి జగన్నాథ్ కి తన సెంటిమెంట్ కూడా సాయపడి సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుందాం.
‘బిజినెస్ మేన్’ సెంటిమెంట్ ఫాలో అవుతున్న పూరి
‘బిజినెస్ మేన్’ సెంటిమెంట్ ఫాలో అవుతున్న పూరి
Published on Oct 17, 2012 7:30 PM IST
సంబంధిత సమాచారం
- దుమ్ము లేపుతున్న ‘లిటిల్ హార్ట్స్’.. జాక్ పాటే.!
- బిగ్ బాస్ 9 తెలుగు కంటెస్టెంట్స్ లిస్ట్: సామాన్యులు, తారలు వీరే
- వైరల్ పిక్: ‘ఇంద్ర’ సెట్స్ లో బాలయ్య సందడి చూసారా?
- ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెట్స్ లో హీరోయిన్స్ క్యూట్ మూమెంట్స్!
- ‘మిరాయ్’లో AI విజువల్స్.. అందరి నోర్లు మూయించిన తేజ సజ్జ
- ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ నెక్స్ట్ సాంగ్ రిలీజ్ కి టైం ఫిక్స్!
- అమెరికా గడ్డపై 40 వేల టికెట్స్ తో ‘ఓజి’ ర్యాంపేజ్!
- ఫోటో మూమెంట్: ఒకే ఫ్రేమ్ లో మలయాళ మెగాస్టార్స్!
- క్రేజీ బజ్.. మహేష్ 29 ఫస్ట్ లుక్ ఒకటే కాదు.. అంతకు మించి ప్లాన్ చేసిన జక్కన్న?
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష: ‘లిటిల్ హార్ట్స్’ – యువతని ఎంటర్టైన్ చేస్తుంది
- సమీక్ష: ‘ఘాటి’ – కొంతవరకే మెప్పించే రివెంజ్ డ్రామా
- సమీక్ష: ‘మదరాసి’ – అక్కడక్కడా ఓకే అనిపించే యాక్షన్ డ్రామా
- సమీక్ష: బాఘి 4 – బోరింగ్ యాక్షన్ డ్రామా
- ఓటిటి సమీక్ష: ‘ఇన్స్పెక్టర్ ఝండే’ – తెలుగు డబ్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చిత్రం నెట్ ఫ్లిక్స్ లో
- మిరాయ్ తో తేజ సక్సెస్ కంటిన్యూ చేస్తాడా?
- SSMB29 ఎపిక్ అనౌన్స్మెంట్ ఆ రోజేనా..?
- ఫోటో మూమెంట్: ఒకే ఫ్రేమ్ లో మలయాళ మెగాస్టార్స్!