రెబల్ డైరెక్టర్ లారెన్స్ మీద ఆ చిత్ర నిర్మాతలు నిర్మాతల మండలిలో కంప్లైంట్ చేసారు. వివరాల్లోకి వెళితే ప్రభాస్ హీరోగా లారెన్స్ డైరెక్షన్లో తెరకెక్కిన రెబల్ సినిమా ఇటీవలే విడుదలైంది. విడుదలైన మొదటి వారం భారీ ఓపెనింగ్స్ తెచ్చుకున్నప్పటికీ ఆ తరువాత కలెక్షన్స్ భారీగా తగ్గిపోయాయి. అయితే ఈ చిత్రం మొదట 22.5 కోట్లతో పూర్తి చేస్తానని మాట ఇచ్చిన లారెన్స్ షూటింగ్ ఆలస్యం చేస్తూ ఉండటం వల్ల సినిమా బడ్జెట్ 40 కోట్లు దాటిందని నిర్మాతలు జే. భగవాన్, జే. పుల్లా రావు చెబుతున్నారు. బడ్జెట్ భారీగా పెరగడం వల్ల తాము 5 కోట్లకు పైగా నష్టపోయామని వారు నిర్మాతల మండలిలో కంప్లైంట్ చేసారు. అయితే దీని పై లారెన్స్ వెర్షన్ మరోలా ఉంది. తనకు ఇవ్వాల్సిన పారితోషికం ఇవ్వకపోగా తనకు ఇస్తానన్న రీమేక్ రైట్స్ తనకు తెలియకుండా అమ్మేశారని చిత్ర నిర్మాతల మీద దర్శకుల సంఘానికి ఫిర్యాదు చేసారు.
లారెన్స్ మీద కంప్లైంట్ ఇచ్చిన నిర్మాతలు
లారెన్స్ మీద కంప్లైంట్ ఇచ్చిన నిర్మాతలు
Published on Oct 15, 2012 12:36 PM IST
సంబంధిత సమాచారం
- SSMB29 ఎపిక్ అనౌన్స్మెంట్ ఆ రోజేనా..?
- ‘వరప్రసాద్ గారు’ కూడా దెబ్బతిన్నారు..!
- ప్రభాస్ను చూసి భయపడ్డానంటున్న సందీప్ రెడ్డి వంగా..!
- రీల్ కాదు.. రియల్ హీరో అనిపించుకున్న బెల్లంకొండ శ్రీనివాస్
- ఇంటర్వ్యూ : నిర్మాత సాహు గారపాటి – ‘కిష్కింధపురి’ ఆడియన్స్ను ఎంగేజ్ చేస్తుంది..!
- ‘మిరాయ్’లో ఆ సీక్వెన్స్ నెక్స్ట్ లెవెల్ అంటున్న మంచు మనోజ్
- సుకుమార్ నోట ‘పుష్ప 3’ మాట.. పండగ చేసుకుంటున్న ఫ్యాన్స్!
- ఆ హీరోతో లోకేశ్ కనగరాజ్ సినిమా లేనట్టేనా..?
- బుక్ మై షోలో ‘మిరాయ్’ దూకుడు.. అప్పుడే ఆ మార్క్..!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష: ‘లిటిల్ హార్ట్స్’ – యువతని ఎంటర్టైన్ చేస్తుంది
- సమీక్ష: ‘ఘాటి’ – కొంతవరకే మెప్పించే రివెంజ్ డ్రామా
- సమీక్ష: ‘మదరాసి’ – అక్కడక్కడా ఓకే అనిపించే యాక్షన్ డ్రామా
- సమీక్ష: బాఘి 4 – బోరింగ్ యాక్షన్ డ్రామా
- ఉస్తాద్ భగత్ సింగ్ సాలిడ్ అప్డేట్.. ఇది మామూలుగా ఉండదట..!
- ఎన్టీఆర్ హీరోయిన్కు అగ్నిపరీక్ష
- ఓటిటి సమీక్ష: ‘ఇన్స్పెక్టర్ ఝండే’ – తెలుగు డబ్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చిత్రం నెట్ ఫ్లిక్స్ లో
- అక్కడ 35 వేల టికెట్స్ తో ‘ఓజి’ హవా!