నటసింహం బాలయ్య – బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన ‘అఖండ’ చిత్రం అద్భుత విజయాన్ని సాధించింది. దీంతో, ‘అఖండ 2 – తాండవం’ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో సంయుక్త కథానాయికగా కనిపించనున్నారు. ఐతే, తాజాగా ‘అఖండ 2’ విఎఫ్ఎక్స్ పై ఓ క్రేజీ న్యూస్ వినిపిస్తోంది. సినిమాలో దాదాపు 15 నిమిషాల పాటు విఎఫ్ఎక్స్ ఉంటాయని.. పైగా గ్రాఫిక్స్ అన్ని భారీ స్థాయిలో ఉంటాయని తెలుస్తోంది. గ్రాఫిక్స్ కోసం బోయపాటి ప్రత్యేకంగా ఓ టీమ్ ను ఏర్పాటు చేసుకున్నారట. ముఖ్యంగా అఘోర పాత్ర వచ్చే విజువల్స్ సినిమాలోనే హైలైట్ గా ఉంటాయట.
ఇక ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుగుతోందని టీమ్ తెలిపింది. సీజీ, రీ రికార్డింగ్ పనులు ఒకేసారి జరుగుతున్నాయని వెల్లడించింది. తమన్ స్వరాలు అందిస్తోన్న ఈ సినిమా సెప్టెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్నట్లు చిత్రబృందం మరోసారి స్పష్టం చేసింది. ఇప్పటికే, విడుదలైన ఈ సినిమా టీజర్ ట్రెండ్ సృష్టించిన విషయం తెలిసిందే. అఖండ 2 – తాండవం’ పై రెట్టింపు అంచనాలు ఉన్నాయి. కాగా ఈ సినిమాను 14 రీల్స్ ప్లస్ బ్యానర్పై రామ్ ఆచంట, గోపీ ఆచంట ప్రొడ్యూస్ చేస్తున్నారు.