నటసింహం బాలయ్య బాబు కోసం రచయిత ఎమ్ రత్నం రాసిన కథను ఇప్పటికే బాలయ్య ఓకే చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాని డైరెక్టర్ శ్రీవాస్ డైరెక్ట్ చేసే అవకాశం ఉందట. వచ్చే ఏడాది నుండి ఈ సినిమాని సెట్స్ పైకి తీసుకువెళ్లే ప్లాన్ లో ఉన్నారు టీమ్. ఇక బాలయ్యకు కథ బాగా నచ్చిందని.. ఫుల్ యాక్షన్ తో కూడుకున్న ఎమోషనల్ ఎంటర్ టైనర్ ను రత్నం బాలయ్య కోసం రాసాడని తెలుస్తోంది. మొత్తానికి బాలయ్య మాత్రం జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో ఫుల్ బిజీ అవుతున్నారు. బి గోపాల్ తో ఓ సినిమా చేసే ఆలోచనలో ఉన్నారు.
అలాగే ప్రస్తుతం మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో రాబోతున్న సినిమాలో బాలయ్య నటిస్తున్నాడు. బాలయ్యకు పెద్ద హిట్ ఇవ్వాలనే కసితో బోయపాటి ఈ సినిమా చేస్తున్నాడు. ఇక ఈ సినిమాలో బాలయ్య సరసన కొత్త హీరోయిన్ నటిస్తోందని బోయపాటి ఇప్పటికే చెప్పారు. మొత్తానికి టీజర్ లో మాత్రం బాలయ్య ఎప్పటిలాగే, పవర్ ఫుల్ డైలాగ్ అండ్ ఫుల్ యాక్షన్ తో… పైగా పంచ కట్టులో వైట్ అండ్ వైట్ లో అభిమానులను బాగానే అలరించారు. మరి ఈ సినిమా కూడా సూపర్ హిట్ అవుతుందేమో చూడాలి.