నాన్న గారు ఓకే చేసిన లాస్ట్ ప్రాజెక్ట్ సుడిగాడు : అల్లరి నరేష్


సడన్ స్టార్ గా వచ్చి సడన్ హిట్ కొట్టిన ‘సుడిగాడు’ తన నాన్న గారు అంగీకరించిన చివరి ప్రాజెక్ట్ అని అల్లరి నరేష్ అన్నారు. విడుదలై విజయవంతంగా మొదటి వారం పూర్తి చేసుకున్న ఏఎ విశేషాలను తెలియజేయడానికి ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో అల్లరి నరేష్ మాట్లాడుతూ మొదట ఈ సినిమా చేద్దాం అనుకున్నప్పుడు బడ్జెట్ దాటిపోవడంతో ఇద్దరు నిర్మాతలు మారిపోయారు. ఈ సినిమా కోసం 9 మంది స్క్రిప్ట్ రచయితలు దాదాపు 13 నెలలు కష్టపడి పనిచేసారు. నాకు ఈ సినిమాలో బాగా నచ్చిన సీన్ అంటే ఓంకార్ స్పూఫ్ బాగా నచ్చింది. నాకంటూ ప్రత్యేకంగా ఫ్యాన్స్ అంటూ ఎవరూ లేరు. అందరు హీరోల ఫ్యాన్స్ నా సినిమాలు సరదాగా చూసి ఎంజాయ్ చేస్తారు. నా గత సినిమాల కంటె ఈ సినిమాకి బాగా ప్రమోట్ చేయడం వాళ్ళ ఓపెనింగ్స్ బాగా భారీగా వచ్చాయి. చుసిన ప్రతి ఒక్కరూ బావుందని చెప్పడంతో మౌత్ టాక్ ద్వారా కూడా ఈ రేంజ్ హిట్ సాధ్యమైంది. ఒకప్పుడు డాన్సులు చేయాలంటే బద్ధకంగా ఉండేది. సీమ శాస్త్రి టైంలో నాగేశ్వర్ రెడ్డి గారు నాలో ఉన్న డాన్సు టాలెంట్ గుర్తించారు. అప్పటి నుండి డాన్సు చేయడం బాగా ఎంజాయ్ చేస్తున్నాను.

Exit mobile version