ఆర్థిక ఇబ్బందులతో యువ నటుడు ఆత్మ హత్య…!

కరోనా వైరస్ కారణంగా ఏర్పడిన సంక్షోభం పేదలనే కాకుండా ప్రముఖులను కూడా బలితీసుకుంటుంది. దేశంలో ఏర్పడిన ఈ పరిస్థితి ఎంతటి ఇబ్బందులకు కారణం అవుతుందో తాజా సంఘటన చూస్తే అర్థం అవుతుంది. లాక్ డౌన్ వలన షూటింగ్స్ లేక నటులకు ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ పరిస్థితులను ఎదుర్కోలేక కొందరు నటులు దారుణ చర్యలకు ఒడిగడుతున్నారు. కాగా పంజాబీ నటుడు మన్మీత్ గైవాల్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయన ఆత్మ హత్యకు కారణం ఆర్థిక ఇబ్బందులే అని తెలుస్తుంది.

పంజాబ్‌కు చెందిన మన్మీత్ ప్రస్తుతం ముంబైలోని ఖర్గార్‌లో తన భార్యతో కలిసి నివసిస్తున్నాడు. షూటింగ్స్ లేని కారణంగా ఆర్ధిక ఇబ్బందులకు గురి అయిన మన్మీత్ ఉరేసుకుని చనిపోయినట్లు అతని ఫ్యామిలీ ఫ్రెండ్ మంజీత్ సింగ్ రాజ్‌పుత్ మీడియాకు వెల్లడించాడు. కాగా మన్మీత్ ‘ఆదత్ సే మజ్బూర్’, ‘కుల్దీపాక్’ వంటి సీరియల్స్‌లో నటించి ప్రేక్షకాదరణ సొంతం చేసుకున్నాడు. పలు టీవీ కార్యక్రమాలతో పాటు వాణిజ్య ప్రకటనలలో కూడా కనిపించాడు.

Exit mobile version