యూనివర్సల్ హీరో కమల్ హాసన్, క్లాసిక్ డైరెక్టర్ మణిరత్నం చాలా కాలం తర్వాత కలిసి చేసిన చిత్రం ‘థగ్ లైఫ్’. ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్కు మంచి రెస్పాన్స్ రావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దీనికి తోడు ఈ సినిమాలో కమల్తో పాటు శింబు కూడా నటిస్తుండటంతో ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేయడం ఖాయమని అందరూ భావించారు.
కట్ చేస్తే, ఈ సినిమాకు నెగిటివ్ రెస్పాన్స్ రావడంతో ఇది డిజాస్టర్గా మిగలనుంది. అయితే, ఈ చిత్రం రిలీజ్కు ముందే పలు వివాదాల్లో చిక్కుకుంది. కర్ణాటకలో ఈ సినిమాను బ్యాన్ చేశారు. దీంతో ఈ సినిమా నిషేధం పై కమల్ సుప్రీం కోర్టును ఆశ్రయించాడు. తాజాగా ఈ వివాదం పై సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది. సెన్సార్ ముగించుకున్న సినిమా రిలీజ్ను ఆపే హక్కు ఎవరికీ లేదని సుప్రీం పేర్కొంది. దీంతో ఈ సినిమాను రిలీజ్ అయ్యేలా చూడాలంటూ కర్ణాటక ప్రభుత్వాన్ని ఆదేశించింది.
ఇక ‘థగ్ లైఫ్’ కర్ణాటక రిలీజ్కు అడ్డంకి తొలిగిపోవడంతో ఈ సినిమా అక్కడ ఎప్పుడు రిలీజ్ అవుతుందనే అంశంపై చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నారు.