హీరో రామ్ ట్విట్టర్ వేదికగా ఓ ఆసక్తికర కామెంట్ చేశారు. సినిమా అనేది కొందరి ఫ్యాషన్, చాలా మందికి వ్యాపారం…ఇక మిగిలిన వారికి జూదం అని చెప్పుకొచ్చారు. ఆయన నటిస్తున్న తాజా చిత్రం రెడ్ మూవీ కూడా ఓ టి టి ద్వారా విడుదల చేసే అవకాశం కలదని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆయన తాజా ట్వీట్ ప్రాధాన్యత సంతరించుకుంది. మరి ఆయన థియేటర్ రిలీజ్ మినహాయించి, డిజిటల్ ప్లాట్ ఫార్మ్ లలో విడుదల చేయడాన్ని సమర్ధిస్తున్నాడా లేక విమర్శిస్తున్నాడా అనేది స్పష్టం కాలేదు.
లాక్ డౌన్ అంతకంతకు పెరుగుతూ పోవడం, కరోనా వైరస్ కారణంగా ఇప్పట్లో సినిమా థియేటర్స్ తెరుకునే పరిస్థితి కనిపించకపోవడంతో చాలా చిత్రాల నిర్మాతలు ఓ టి టి వైపు మొగ్గే అవకాశం కలదని వార్తలు వస్తున్నాయి. కిషోర్ తిరుమల దర్శకత్వంలో రామ్ హీరోగా తెరకెక్కుతున్న రెడ్ మూవీపై కూడా ఈ వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే తెలుగు మరియు తమిళ భాషలో కొన్ని సినిమాలు ఈ దిశగా అడుగులు వేశాయి.
The thing about the Movie Industry is..
It’s a Passion for a few..
a Business for most..
& a Gamble for the rest..Everyone sees it from their own perspective..#OTT #Theatrical #RAndoMthoughts
— RAm POthineni (@ramsayz) May 18, 2020