పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, దర్శకుడు మారుతి కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘ది రాజాసాబ్’ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి హైప్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను పూర్తి హారర్ కామెడీ జోనర్ చిత్రంగా మారుతి అత్యంత ప్రెస్టీజియస్గా రూపొందిస్తున్నాడు. ఇక ఈ చిత్ర టీజర్ను మేకర్స్ రిలీజ్ చేయగా, దానికి ప్రేక్షకుల నుంచి యునానిమస్ రెస్పాన్స్ దక్కింది.
థ్రిల్ చేసే అంశాలతో రాజా సాబ్ టీజర్ అభిమానులను ఆకట్టుకుంది. ఇక ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి జరుగుతున్న బిజినెస్ కూడా ప్రేక్షకులను, సినీ సర్కిల్స్ను స్టన్ చేస్తోంది. తాజాగా రాజాసాబ్ చిత్రానికి సంబంధించిన ఆడియో రైట్స్ రూ.20 కోట్లకు అమ్ముడైనట్లు తెలుస్తోంది. ప్రముఖ సంస్థ టి సిరీస్ రాజాసాబ్ ఆడియో రైట్స్ను ఈ భారీ మొత్తానికి దక్కించుకుంది. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి ఒక్క పాట కూడా రాలేదు. అయినా, అప్పుడే ఈ రేంజ్లో ఆడియో రైట్స్ అమ్ముడుకావడం విశేషం.
ఇక ఈ సినిమాలో డార్లింగ్ ప్రభాస్ తన లుక్స్, పర్ఫార్మెన్స్తో ప్రేక్షకులకు సాలిడ్ ట్రీట్ ఇవ్వనున్నాడు. ఈ సినిమాలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టి.జి.విశ్వప్రసాద్ ప్రొడ్యూస్ చేస్తున్నారు.