టాలీవుడ్ యూత్ స్టార్ నితిన్ లేటెస్ట్ గా “భీష్మ”తో మంచి కంబ్యాక్ హిట్ అందుకున్నారు. ఇపుడు దీని తర్వాత మొత్తం మూడు ప్రాజెక్టులు తన వరుసలో ఉండగా మొట్టమొదటిగా చేస్తున్న పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ “పవర్ పేట” కు సంబంధించి పలు ఆసక్తికర విషయాలే ఇప్పుడు తెలుస్తున్నాయి. దర్శకుడు కృష్ణ చైతన్య ఈ చిత్రాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా డిజైన్ చేసే పనిలో ఉన్నారు.
అందులో భాగంగా నితిన్ ఈ చిత్రంలో మూడు విభిన్నమైన రోల్స్ లో కనిపించనున్నారని టాక్ వినిపించింది. అలాగే ఈ చిత్రంలో సీనియర్ హీరోయిన్ నదియా కూడా నటిస్తున్నట్టు ఇప్పుడు సమాచారం. ఈమెకు ఈ చిత్రంలో కీలక రోల్ ఉంటుందని తెలుస్తుంది. ప్రస్తుతం నితిన్ నటిస్తున్న “రంగ్ దే” హీరోయిన్ కీర్తి సురేషే హీరోయిన్ గా కన్ఫర్మ్ అయ్యింది.