బాలీవుడ్ దర్శకుడు అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్న ప్రెస్టీజియస్ చిత్రం ‘వార్-2’ కోసం నార్త్ ప్రేక్షకులతో పాటు దక్షిణాది ఆడియన్స్ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ గ్రీకువీరుడు హృతిక్ రోషన్తో పాటు టాలీవుడ్ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కలిసి నటిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు నెక్స్ట్ లెవెల్లో నెలకొన్నాయి.
ఇక యశ్ రాజ్ ఫిల్మ్స్ పతాకంపై తెరకెక్కుతున్న స్పై చిత్రాల్లో ఈ మూవీ కూడా వస్తుండటంతో ఈ చిత్రం కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అయితే, ఈ సినిమా షూటింగ్కు చాలా సమయం పట్టడంతో అభిమానుల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తం అవుతుంది. అయితే, ఈ సినిమాకు ఆలస్యం కావడం వెనుక అసలు కారణాన్ని చిత్ర మేకర్స్ తాజాగా వెల్లడించారు.
ఈ ‘వార్-2’ సినిమా ఆలస్యానికి చాలా కారణాలు ఉన్నాయని.. అందులో ఇలాంటి ఫేవరేట్ సీక్వెల్ చిత్రాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే చాలా సమస్యలు వచ్చాయని ఆయన అన్నారు. ప్రేక్షకుల అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ సినిమా ఉండేలా తీర్చిదిద్దడంలో తమకు చాలా సమస్యలు ఎదురయ్యాయని.. వాటన్నింటినీ పరిష్కరించుకునే సరికి చాలా సమయం పట్టిందని ఈ దర్శకుడు తాజాగా పేర్కొన్నాడు. ఈ సినిమాను చూసినప్పుడు ప్రేక్షకులు లైఫ్ టైమ్ అనుభూతిని పొందడం ఖాయమని ఆయన అన్నారు.