ఆ వార్తతో టాలీవుడ్ అలర్ట్..!

ఆ వార్తతో టాలీవుడ్ అలర్ట్..!

Published on Jun 20, 2020 12:41 PM IST

నటుడు మరియు నిర్మాత బండ్ల గణేష్ కి కరోనా సోకిందన్న వార్త టాలీవుడ్ కి పెద్ద షాక్ ఇచ్చింది. దేశంలోని అనేక చిత్ర పరిశ్రమలకు చెందిన నటులు దీనిన బారినపడినట్టు వార్తలు రాగా, టాలీవుడ్ మాత్రం కరోనా ఫ్రీ ఇండస్ట్రీగా ఉంది. తాజా న్యూస్ ఆ స్టేటస్ చెరిపివేసేలా ఉంది. దానికి తోడు షూటింగ్స్ మొదలుపెడదాం అని సన్నద్ధం అవుతున్న దర్శక నిర్మాతలు మరియు నటులకు ఇది ఒక వార్నింగ్ బెల్ లా వినపడింది.

తెలంగాణా రాష్ట్రంలో కరోనా విజృంభణ అధికంకాగా… హైదరాబాద్ లో రోజుకు వందల సంఖ్యలో కేసులు నమోదు కావడం భయపెడుతున్న అంశము. ఎదో విధంగా షూటింగ్స్ మొదలుపెడదాం అనుకుంటున్న వారు తమ నిర్ణయం వెనక్కి తీసుకొనే ఆలోచనలో ఉన్నారు. ఇక సీనియర్ హీరోలు వయసురీత్యా షూటింగ్ కి ససేమిరా అంటున్నారు. మొత్తంగా బండ్ల గణేష్ పై వచ్చిన వార్త టాలీవుడ్ ని షేక్ చేసింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు