కరోనా తగ్గాక యాక్షన్ సీక్వెన్సెస్ !

కరోనా తగ్గాక యాక్షన్ సీక్వెన్సెస్ !

Published on Apr 19, 2020 8:04 PM IST

తమిళ్ ఇండస్ట్రీలో స్టార్ హీరో అజిత్ ప్రస్తుతం చేస్తోన్న నూతన సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. వాలి మై అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఇప్పటికే కీలకమైన సన్నివేశాలను పూర్తి చేసుకుంది. అయితే కరోనా ప్రభావం హైదరాబద్ లో ఓ ప్రముఖ స్టూడియోలో పలు యాక్షన్ సీక్వెన్సెస్ ను ప్లాన్ చేయనున్నారు.

హెచ్ వినోత్ దర్శకత్వంలో రానున్న ఈ సినిమాలో అజిత్ డ్యూయల్ రోల్ లో నటిస్తున్నాడట. అందులో ఒక పాత్రలో అజిత్ పవర్ ఫుల్ పోలీస్ అధికారిగా కనిపించబోతున్నారని తమిళ్ సినీ వర్గాల్లో వినిపిస్తోంది. ఏమైనా అజిత్ ద్విపాత్రాభినయంలో ఏమి చేసినా ఆయన ఫ్యాన్స్ కు అది ప్రత్యేకంగానే ఉంటుంది.

ఇక గత కొన్ని సినిమాలుగా అజిత్ వరుస సూపర్ హిట్స్ తో తమిళ్ బాక్సాఫీస్ కి ఎప్పటికప్పుడు తన స్టామినా ఏమిటో ప్రూవ్ చేస్తూనే ఉన్నారు. గత కొన్ని సినిమాలుగా అజిత్ చిత్రాలు తమిళంలో వరుస రికార్డ్స్ మీద రికార్డ్స్ సాధిస్తుండటం విశేషం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు