హీరో సుశాంత్ రాజ్పుత్ సింగ్ అస్థికలను కుటుంబ సభ్యులు నేడు గంగలో నిమజ్జనం చేశారు. తండ్రి కేకే సింగ్, సోదరి శ్వేత సింగ్ కృతి ఇతర కుటుంబ సభ్యులు అతడికి అంతిమ వీడ్కోలు పలుకుతూ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ఈ విషయాన్ని సుశాంత్ సోదరి శ్వేత సింగ్ కీర్తి ఫేస్బుక్ వేదికగా గురువారం వెల్లడించారు. తన తమ్ముడి కోసం ఎవరూ బాధ పడొద్దని మరోసారి విజ్ఞప్తి చేశారు.
గత ఆదివారం హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మ హత్య చేసుకొని ప్రాణాలు వదిలిన సంగతి తెలిసిందే. ఒంటరిగా బాంద్రాలోని ఓ అపార్ట్మెంట్ లో నివాసం ఉంటున్న సుశాంత్ డిప్రెషన్ కారణంగా ఉరి వేసుకొని ఆత్మ హత్య చేసుకున్నారు. ఈ విషయంలో దేశవ్యాప్తంగా బాలీవుడ్ పెద్దలపై తీవ్ర నిరసనలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. సుశాంత్ ఆత్మ హత్య విషయంలో ఆయన ఆప్తమిత్రులను విచారం చేస్తున్నారు.