యూనివర్సల్ హీరో కమల్ హాసన్ నటించిన లేటెస్ట్ మూవీ ‘థగ్ లైఫ్’ భారీ అంచనాల మధ్య జూన్ 5న వరల్డ్వైడ్గా రిలీజ్ అయింది. ఈ సినిమాను దర్శకుడు మణిరత్నం డైరెక్ట్ చేయడంతో ప్రేక్షకుల్లో ఈ మూవీపై సాలిడ్ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఈ సినిమాను పాన్ ఇండియా భాషల్లో గ్రాండ్గా రిలీజ్ చేశారు.
అయితే, ఈ సినిమాను కర్ణాటక రాష్ట్రంలో బ్యాన్ చేశారు. ఈ చిత్ర ప్రమోషన్స్ సందర్భంగా కమల్ చేసిన కొన్ని కామెంట్స్కు కర్ణాటక ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అభ్యంతరం వ్యక్తం చేసింది. కన్నడ భాషపై కమల్ చేసిన కామెంట్స్కు ఆయన క్షమాపణ చెప్పాల్సిందే అని తేల్చింది. దీంతో ఈ విషయం హైకోర్టుకు వెళ్లగా అక్కడ కూడా కమల్ ఓ క్షమాపణ చెప్పాల్సిందే అని తీర్పు వచ్చింది. దీంతో ఈ పంచాయతీ ఇప్పుడు సుప్రీం కోర్టుకు చేరింది.
తాజాగా శుక్రవారం రోజున ఈ పిటీషన్పై సుప్రీంలో విచారణ జరిగింది. రిలీజ్కు రెడీ అయిన సినిమాపై అనధికారికంగా నిషేధం విధించారనే పిటీషన్ను విచారించిన సుప్రీం కోర్టు కర్ణాటక ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఈ కేసుకు సంబంధించి తదుపరి విచారణ జూన్ 17కి వాయిదా వేసింది. అయితే, థగ్ లైఫ్ చిత్రానికి మిగతా భాషల్లో ప్రేక్షకుల నుంచి డిజాస్టర్ రెస్పాన్స్ రావడం గమనార్హం.