టాలీవుడ్లో తెరకెక్కిన లేటెస్ట్ చిత్రం ‘జూనియర్’ రిలీజ్కు రెడీ అయింది. కిరీటి హీరోగా ఇంట్రొడ్యూస్ అవుతున్న ఈ సినిమాను రాధాకృష్ణ డైరెక్ట్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్గా నటిస్తుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ అయింది.
దీనికి తోడు ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ ఈ సినిమాపై పాజిటివ్ బజ్ క్రియేట్ అయ్యేలా చేసింది. అయితే, ఈ చిత్రంలో నటించేందుకు శ్రీలీల భారీగా రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ‘జూనియర్’ చిత్రం కోసం ఆమె ఏకంగా రూ.2.5 కోట్ల మేర రెమ్యునరేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది.
శ్రీలీలకు ఉన్న క్రేజ్, డిమాండ్ కారణంగా ఆమె ఇంత మొత్తంలో రెమ్యునరేషన్ తీసుకుందని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో జెనీలియా మరో కీలక పాత్రలో నటిస్తోంది. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా సాయి కొర్రపాటి ప్రొడ్యూస్ చేశారు. జూలై 18న ఈ చిత్రం గ్రాండ్ రిలీజ్కు రెడీ అవుతోంది.