‘మిత్ర మండలి’ చిత్రాన్ని హార్ట్‌తో చూడండి : శ్రీ విష్ణు

‘మిత్ర మండలి’ చిత్రాన్ని హార్ట్‌తో చూడండి : శ్రీ విష్ణు

Published on Oct 14, 2025 2:00 AM IST

Mithra-Mandali

బీవీ వర్క్స్ బ్యానర్ పై బన్నీ వాస్ సమర్పణలో సప్త అశ్వ మీడియా వర్క్స్ మీద కళ్యాణ్ మంతెన, భాను ప్రతాప, డా. విజేందర్ రెడ్డి తీగల నిర్మించిన చిత్రం ‘మిత్ర మండలి’. ఈ మూవీలో ప్రియదర్శి, నిహారిక ఎన్ఎం హీరో హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాకు విజయేందర్ దర్శకత్వం వహించారు. బ్రహ్మానందం, వెన్నెల కిషోర్, సత్య, విష్ణు ఓయి, రాగ్ మయూర్, ప్రసాద్ బెహరా, విటివి గణేష్ ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని అక్టోబర్ 16న విడుదల చేస్తున్నారు. తాజాగా ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హీరో శ్రీ విష్ణు గెస్ట్‌గా వచ్చారు.

ఈ సందర్భంగా శ్రీ విష్ణు మాట్లాడుతూ.. ‘‘తిప్పరామీసం’ టైంలో విజయ్ ఏడీగా పని చేశారు. ‘మిత్ర మండలి’ పెద్ద హిట్ అవుతుంది. రాగ్ మయూర్, విష్ణు, ప్రసాద్ ఇలా అందరూ నాకు ఇష్టం. ప్రియదర్శి ఎప్పుడూ ఎనర్జీగానే ఉంటాడు. ఆయన మంచి కథల్ని ఎంచుకుంటూ ఉంటాడు. ఇలానే ఎప్పుడూ మంచి కథలు, సినిమాల్ని చేస్తూ వెళ్లాలి. నిహారిక రీల్స్ నేను చూస్తుండేవాడిని. నిర్మాతలైన కళ్యాణ్, భాను, సోము, విజేందర్ అందరూ కూడా నాకు స్నేహితులు. బన్నీ వాస్ గారు నెలకి ఒక సూపర్ హిట్ మూవీని అందిస్తున్నారు. ఆయన ఉన్నారంటే సినిమా హిట్ గ్యారెంటీ. అంత నమ్మకంగా ఉన్నారు కాబట్టే అక్టోబర్ 15న ప్రీమియర్లు వేస్తున్నారు. ఈ మూవీని మైండ్‌తో కాకుండా, మనసుతో చూడండి. అందరినీ నవ్విస్తుంది.’ అని అన్నారు.

ప్రియదర్శి మాట్లాడుతూ.. ‘మా ‘మిత్ర మిండలి’ మూవీ ఈవెంట్ కోసం వచ్చిన శ్రీ విష్ణు గారికి థాంక్స్. ‘మిత్ర మండలి’ సినిమా బాగా వచ్చింది. నేను ఆల్రెడీ మూవీని చూశాను. ఈ చిత్రం మీకు నచ్చకపోతే.. నెక్ట్స్ వచ్చే నా ఏ సినిమాని కూడా చూడకండి. ‘మిత్ర మండలి’తో దీపావళిని మేం మీ కోసం ముందుగానే తీసుకు వస్తున్నాం. అక్టోబర్ 16న ఫ్రెండ్స్, ఫ్యామిలీతో వెళ్లి మా చిత్రాన్ని చూడండి’ అని అన్నారు.

బన్నీ వాస్ మాట్లాడుతూ.. ‘మా కోసం వచ్చిన శ్రీ విష్ణు గారికి థాంక్స్. ‘మిత్ర మండలి’ కోసం పని చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. ప్రియదర్శి నాకు వ్యక్తిగతంగా చాలా ఇష్టమైన వ్యక్తి. ‘మిత్ర మండలి’ చిత్రం చాలా బాగా వచ్చింది. దీపావళికి ఫ్యామిలీని నవ్వించే క్లీన్ ఎంటర్టైనర్‌. అందరినీ హాయిగా నవ్వించే మా సినిమాను అక్టోబర్ 16న రిలీజ్ చేస్తున్నాం. అందరూ వచ్చి మా మూవీని చూసి ఎంజాయ్ చేయండి.’ అని అన్నారు.

నిహారిక ఎన్ఎం మాట్లాడుతూ.. ‘‘మిత్ర మండలి’తో నేను తెలుగు పరిశ్రమలోకి వస్తున్నాను. అందరి సహకారంతో ఇక్కడి వరకు వచ్చాం. మా కోసం వచ్చిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. అక్టోబర్ 16న మా చిత్రం రాబోతోంది. అందరూ చూసి హిట్ చేయండి’ అని అన్నారు.

డైరెక్టర్ విజయేందర్ మాట్లాడుతూ .. ‘నేను శ్రీ విష్ణు గారి ‘తిప్పరామీసం’ సినిమాకు మొదటి సారిగా పని చేశాను. అలా నా జర్నీ ప్రారంభమైంది. ఈ రోజు ఇలా నా సినిమా ఈవెంట్‌కు ఆయన గెస్ట్‌గా రావడం ఆనందంగా ఉంది. ఈ ప్రయాణంలో సపోర్ట్ చేసిన బన్నీ వాస్ గారికి థాంక్స్. ఈ జర్నీలో నాకు తోడుగా నిలిచిన ప్రియదర్శి, నిహారిక, విష్ణు, రాగ్ మయూర్ ఇలా టీం అందరికీ థాంక్స్. నాకు ఫుల్ సపోర్ట్ ఇచ్చిన నిర్మాతలకు థాంక్స్. ‘మిత్ర మండలి’ సినిమా చాలా బాగా వచ్చింది. అందరూ చూసి సక్సెస్ చేయండి’ అని అన్నారు.

ఈ కార్యక్రమంలో నిర్మాత భాను ప్రతాప, డా.విజేందర్ రెడ్డి తీగల, సంగీత దర్శకుడు ధృవన్, దర్శకులు అనుదీప్ కేవీ, కళ్యాణ్ శంకర్, వివేక్ ఆత్రేయ, ఆదిత్య హాసన్ తదితరులు పాల్గొని మాట్లాడారు.

తాజా వార్తలు