తెలుగులో సరికొత్త రికార్డును నెలకొల్పిన షాడో

తెలుగులో సరికొత్త రికార్డును నెలకొల్పిన షాడో

Published on Apr 19, 2013 11:41 AM IST
First Posted at 22:35 on Apr 19th

Venkatesh
విక్టరీ వెంకటేష్ తాజా చిత్రం ‘షాడో’ తెలుగు చలన చిత్ర సీమలో సరికొత్త రికార్డును నెలకొల్పింది. డైరెక్టర్ మెహర్ రమేష్ ఈ సినిమా తెలుగు సినిమా చరిత్రలోనే మొదటిసారిగా ఆరో 11. 1 3డి సౌండ్ విధానం ద్వారా తెరకెక్కించారట. “‘షాడో’ టాలీవుడ్లో మొదటిసారిగా ఆరో 11. 1 3డి సౌండ్ విధానం ద్వారా 55 స్పీకర్ల సామర్ధ్యం గల ప్రసాద్ మల్టీప్లెక్స్ లో ఆంధ్రపదేశ్ లోనే తొలిసారిగా ప్రసారం కానుంది. ఈ వింత అనుభూతిని చూడటం కోసం, ఈ ఆరో 11. 1 3డి సౌండ్ ద్వారా థమన్ పాటలు వినడం కోసం నేను ‘షాడో’ విడుదల సమయం వరకూ ఎదురుచూడలేకపోతున్నానని” మెహర్ రమేష్ ట్వీట్ చేసాడు. ఈ ఆరో 11. 1 3డి సౌండ్ విధానం గురించి ఇదివరకు కమల్ నటించిన ‘విశ్వరూపం’ చాలా హంగామా జరిగింది. ఇప్పుడు ఆ లిస్ట్ లోకి ‘షాడో’ కూడా చేరింది. ఇందులో వెంకటేష్, తాప్సీ ముఖ్యపాత్రధారులు. ఈ యాక్షన్ ఎంటర్టైనర్లో శ్రీ కాంత్ ఒక ముఖ్యమైన పోలీస్ ఆఫీసర్ పాత్ర పోషించాడు. థమన్ సంగీతం అందించాడు. ఈ సినిమా ఈనెల 26న మన ముందుకి రానుంది.

తాజా వార్తలు