దర్శకధీరుడు రాజమౌళి – మహేష్ బాబు సినిమాను హాలీవుడ్ స్థాయిలో నిర్మించబోతున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ గా ప్రియాంక చోప్రా నటిస్తోంది. రీసెంట్ గా కెన్యా షెడ్యూల్ ను పూర్తి చేసుకున్న ఈ సినిమా, ప్రస్తుతం కొత్త షెడ్యూల్ కోసం కసరత్తులు చేస్తోంది. ఈ షెడ్యూల్ కోసం కాశీ క్షేత్రానికి సంబంధించిన భారీ సెట్ ను కూడా వేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సెట్ లో జరగబోయే షెడ్యూల్ లో కీలక తారాగణమంతా పాల్గొననున్నారని తెలుస్తోంది.
కాగా ఆ మధ్య విజయేంద్రప్రసాద్ ఈ సినిమా కథ గురించి ఓ ఇంటర్వ్యూలో చెబుతూ.. ‘నేను, రాజమౌళి ఇద్దరం దక్షిణాఫ్రికా నవలా రచయిత విల్బర్ స్మిత్ కు పెద్ద అభిమానులం. అందుకే ఆయన పుస్తకాల ఆధారంగానే ఈ సినిమా స్క్రిప్ట్ ను రాశాను’ అంటూ చెప్పుకొచ్చారు. కాబట్టి రాజమౌళి – మహేష్ సినిమా ఒక అడ్వెంచర్ థ్రిల్లర్ గా ఉండబోతుంది. ఈ చిత్రానికి కీరవాణి సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. విజయేంద్రప్రసాద్ కథ, దేవా కట్టా సంభాషణలు అందిస్తున్నారు.