“రేయ్” చిత్రంలో శుబ్రా అయ్యప్ప స్థానంలో సైయామి ఖేర్

“రేయ్” చిత్రంలో శుబ్రా అయ్యప్ప స్థానంలో సైయామి ఖేర్

Published on Apr 7, 2012 9:55 AM IST

వై వి ఎస్ చౌదరి సాయి ధరం తేజ్ ని పరిచయం చేస్తూ చేస్తున్న చిత్రం “రేయ్”. ఈ చిత్రం మొదలయినప్పటి నుండి చాలా అడ్డంకులు ఎదుర్కొంది.చిరంజీవి అల్లుడుని పరిచయం చేస్తూ మొదలయిన ఈ చిత్రంలో కథానాయికలుగా శుబ్రా అయ్యప్ప మరియు అమృత పట్కి నటించాల్సి ఉండగా. కొద్ది రోజుల తరువాత అమృత పట్కి ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకోగా తన స్థానాన్ని వై వి ఎస్ చౌదరి శ్రద్ద దాస్ తో బర్తీ చేశారు. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం నుండి శుబ్రా అయ్యప్ప కూడా తప్పుకున్నట్టు తెలుస్తుంది.ఇందువలన వై వి ఎస్ చౌదరి శుబ్రా అయ్యప్ప స్థానంలో నూతన నటి సైయామి ఖేర్ ని ఎంపిక చేసుకున్నారు. ముంబై కి చెందిన ఈ మోడల్ కింగ్ ఫిషర్ క్యాలెండర్ లో ఒక ఫోటో కి పోజ్ ఇచ్చింది ఇదే కాకుండా పాంటాలూన్స్ మరియు రేమాండ్స్ వంటి యాడ్స్ లో కనిపించింది. ప్రస్తుతం హైదరాబాద్ లో చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ భామ ప్రముఖ పత్రికతో మాట్లాడుతూ హిందీలో కాకుండా తెలుగులో పరిచయం కావటం చాలా ఆనందంగా ఉందని అన్నారు. వై వి ఎస్ చౌదరి స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న ఈ చిత్రానికి చక్రి సంగీతం అందిస్తున్నారు.

తాజా వార్తలు