‘ఆది పురుష్’లో నటించినందుకు సారీ చెప్పాడట

‘ఆది పురుష్’లో నటించినందుకు సారీ చెప్పాడట

Published on May 5, 2025 11:00 AM IST

పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కిన భారీ మైథలాజికల్ మూవీ ఆదిపురుష్. ఓం రౌత్ తెరకెక్కించిన ఈ ‘ఆదిపురుష్’ సినిమాకు థియేటర్లలో మిశ్రమ స్పందన వచ్చింది. అలాగే ఓటీటీలో కూడా ఆశించిన స్థాయిలో ఈ మూవీ విజయాన్ని సాధించలేదు. ఈ నేపథ్యంలో తన కుమారుడికి ‘ఆది పురుష్‌’ సినిమా చూపించిన తర్వాత సారీ చెప్పానని బాలీవుడ్‌ నటుడు సైఫ్‌ అలీ ఖాన్ కామెంట్స్‌ చేశారు. ఇంతకీ, సైఫ్‌ అలీ ఖాన్ ఏం మాట్లాడారు అంటే.. ‘నేను ‘ఆదిపురుష్‌’లో విలన్‌గా నటించాను. ఈ సినిమా చూసిన నా కుమారుడు ఈసారి ఇలాంటి సినిమాలో నన్ను హీరోగా చేయమని కోరాడు’ అని సైఫ్ అలీఖాన్ తెలిపాడు.

సైఫ్ అలీఖాన్ ఇంకా మాట్లాడుతూ.. ‘ఆది పురుష్ లో విలన్‌గా నటించినందుకు నేను నా కొడుక్కి సారీ చెప్పాను. నేను నటించిన అన్ని సినిమాలను ఎలా గౌరవిస్తానో ‘ఆది పురుష్‌’ను కూడా అలానే చూస్తాను. సినిమాలన్నింటికీ నా మద్దతు ఒకేలా ఉంటుంది’’ అని సైఫ్ అలీఖాన్ తెలిపారు. ఇక తన కుమారుడు తైమూర్‌ గురించి సైఫ్‌ మాట్లాడుతూ.. ‘‘నేను ఎన్నో భిన్నమైన పాత్రలు చేస్తుంటాను. అవి చూసి నా కుమారుడు ‘నువ్వు హీరోనా.. విలనా’ అని అడిగాడు’ అంటూ చెప్పుకొచ్చాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు