అభయమ్ మసూమ్ సమ్మిట్‌లో సాయి దుర్గ తేజ్ సందేశం

అభయమ్ మసూమ్ సమ్మిట్‌లో సాయి దుర్గ తేజ్ సందేశం

Published on Sep 14, 2025 1:20 AM IST

Sai-Durga-Tej

ప్రపంచ వ్యాప్తంగా 70 నగరాల నుండి వేల మంది యంగ్ ప్రొఫెషనల్స్ పాల్గొన్న ‘అభయమ్ మసూమ్ సమ్మిట్’ శనివారం హైదరాబాద్‌లో జరిగింది. పిల్లలపై లైంగిక దాడులకు వ్యతిరేకంగా అవగాహన కల్పించే ఉద్దేశ్యంతో కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (CII) – యంగ్ ఇండియన్స్ (YI) ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ వేడుకకు సుప్రీమ్ హీరో సాయి దుర్గ తేజ్, మంత్రి సీతక్క, YI కో-చైర్మన్ భవిన్ పాండ్య, నేషనల్ చైర్మన్ తరంగ్ ఖురానా, సీఐఐ తెలంగాణ చైర్మన్ శివ ప్రసాద్ రెడ్డి, జోత్స్న సింగ్ తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా సాయి దుర్గ తేజ్ మాట్లాడుతూ.. “పిల్లల్ని కాపాడుకోవడం మన బాధ్యత. సోషల్ మీడియాలో పిల్లలపై అబ్యూజ్ చేస్తూ, కామెంట్లకు లైక్స్ పెడుతూ, నవ్వుతున్న దృశ్యాలు చూస్తే చాలా బాధగా ఉంటుంది. ఇలాంటి సమాజం మనం కోరుకోవాలా? స్వేచ్ఛ ఉన్నా, అది ఎదుటివారికి నొప్పి కలిగించే స్థాయిలో ఉండకూడదు.” అని అన్నారు.

2015లో అరకు లోని చైల్డ్ ఎడ్యుకేషన్ కోసం పోరాడానని, అక్కడ స్కూల్ నిర్మించానని, కొంతమంది పిల్లలను దత్తత తీసుకొని వారి విద్య, పోషణ చూసుకుంటున్నానని చెప్పారు. “పిల్లలకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి స్కూల్ టీచర్లు, ఇంట్లో పేరెంట్స్ చెప్పాలి. తల్లిదండ్రులు పిల్లలతో ఎక్కువ సమయం గడపాలి. వారంలో ఒకరోజు అయినా కుటుంబంతో కలిసి కూర్చోవాలి.” అని సూచించారు.

పిల్లల సోషల్ మీడియా అకౌంట్స్ తల్లిదండ్రుల నంబర్లకు లేదా ఆధార్ కార్డ్‌కి లింక్ చేయాలని అభిప్రాయపడ్డారు. “నా సినిమాల్లో టీజింగ్ సాంగ్స్‌కి దూరం వేశాను. ప్రేమిస్తే పొగడాలి కానీ టీజ్ చేయకూడదు. సోషల్ మీడియాలో కాకుండా రియల్ వరల్డ్‌లో బతకడం నేర్పాలి.” అని స్పష్టం చేశారు.

తన పెళ్లిపై వస్తున్న ఊహాగానాల గురించి “నా పెళ్లిని నేనే ప్రకటిస్తాను” అని నవ్వుతూ సమాధానం ఇచ్చారు.

తాజా వార్తలు