యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ రీల్ హీరోనే కాదు, రియల్ హీరో కూడా. నేడు కాజిపల్లి అర్బన్ ఫారెస్ట్ పార్క్ కు శంకుస్థాపన జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఎంపీ సంతోష్ కుమార్ తో పాటు ప్రభాస్ పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. అయితే యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ డేరింగ్ స్టెప్ తీసుకున్నారు. ఆయన ఏకంగా 1650 ఎకరాల అటవీ భూమిని దత్తత తీసుకున్నారు.ఎంపీ సంతోష్ కుమార్ చొరవతో దత్తతకు ముందుకు వచ్చాడట ప్రభాస్.
కాగా ప్రభాస్ దుండిగల్ సమీపంలోని ఖాజిపల్లి అర్బన్ ఫారెస్ట్ బ్లాక్ ను దత్తత తీసుకుని డెవలప్ చేయనున్నారు. దీంతో ఔటర్ రింగ్ రోడ్డు వెంట అందుబాటులోకి రానున్న మరో అర్బన్ ఫారెస్ట్ పార్క్. అన్నట్టు తన తండ్రి దివంగత U.V.S రాజు పేరు మీద అర్బన్ పార్కు, అటవీ ప్రాంతం ప్రభాస్ అభివృద్ది చేస్తాడట..ఇందుకోసం ఇప్పటికే ప్రభాస్ రెండు కోట్ల రూపాయలను అందించాడు. అవసరాన్ని బట్టి మరింత ఖర్చు చేసేందుకు సుముఖత వ్యక్తం చేశాడు.
ఖాజిపల్లిలో అర్బన్ ఫారెస్ట్ పార్కుకు శంఖుస్థాపన చేసిన అనంతరం సంతోష్, ప్రభాస్ మొక్కలు నాటారు. అలాగే వ్యూ పాయింట్ నుంచి అటవీ అందాలు పరిశీలించాడు ప్రభాస్. ఇక త్వరలో మరిన్ని అర్బన్ ఫారెస్ట్ బ్లాక్ ల దత్తతకు ప్రయత్నిస్తామని ఎం.పీ సంతోష్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, పీసీసీఎఫ్ శోభ, ఇతర అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.