వెంకీ బాటలో రవితేజ పయనం..?

వెంకీ బాటలో రవితేజ పయనం..?

Published on Mar 9, 2025 12:00 AM IST

స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ నటించిన రీసెంట్ మూవీ ‘సంక్రాంతికి వస్తున్నాం’ బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాను దర్శకుడు అనిల్ రావిపూడి డైరెక్ట్ చేయగా పూర్తి కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించారు. ఇక ఈ సినిమాలో వెంకటేష్ సరసన ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు. గతంలో వెంకీ ‘ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు’ వంటి క్లాసిక్ చిత్రంలో ఇద్దరు హీరోయిన్లతో నటించాడు. ఆ తర్వాత మళ్లీ అలాంటి వింటేజ్ సక్సెస్ ‘సంక్రాంతికి వస్తున్నాం’తో దక్కింది. అయితే, ఇప్పుడు టాలీవుడ్‌లో హీరోలందరూ ఇదే స్ట్రాటెజీ ఫాలో అవ్వాలని చూస్తున్నారు.

ఈ జాబితాలో మాస్ రాజా రవితేజ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ‘మాస్ జాతర’ సినిమాతో బిజీగా ఉన్న రవితేజ, తన నెక్స్ట్ చిత్రాన్ని దర్శకుడు కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కాగా, ఈ సినిమాలో రవితేజ సరసన ఇద్దరు యంగ్ బ్యూటీలను నటింపజేయాలని మేకర్స్ భావిస్తున్నారట. ఈ సినిమాలో హీరోయిన్లుగా మమిత బైజు, కోయదు లోహర్ లను తీసుకోవాలని చిత్ర యూనిట్ ప్రయత్నాలు చేస్తున్నట్లు సినీ సర్కిల్స్‌లో టాక్ వినిపిస్తుంది.

గతంలో రవితేజ కూడా ఇద్దరు హీరోయిన్లతో సినిమాలు చేశాడు. ఇక చాలా గ్యాప్ తర్వాత ఆయన కూడా ఈ ఫార్ములాను రిపీట్ చేయనుండటంతో ఈ కాంబినేషన్ పై ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ అవుతుంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక క్లారిటీ రావచ్చని చిత్ర వర్గాలు చెబుతున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు