ఒకప్పటి స్టార్ హీరోయిన్ రమ్య కృష్ణ ఇటీవల జయలలిత జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన వెబ్ సిరీస్ క్వీన్ లో నటించారు. జయలలితగా ఆమె నటన ప్రశంశలు అందుకుంది. తెలుగు మరియు తమిళంలో విడుదలైన ఈ వెబ్ సిరీస్ కు గౌతమ్ మీనన్ మరియు ప్రశాంత్ మురుగేషన్ దర్శకత్వం వహించడం జరిగింది. కాగా తాజా ఇంటర్వ్యూ లో రమ్య కృష్ణ ఓ ఆసక్తికర అంశాన్ని బయటపెట్టారు. ఆమెకు ఓ స్ట్రైట్ తెలుగు వెబ్ సిరీస్ చేయాలని ఉందట. అది కూడా మెగాస్టార్ చిరంజీవితో చేయాలని ఉందట.
రానున్న కాలం అంతా డిజిటల్ స్ట్రీమింగ్ దే అనిపిస్తుండగా రమ్య కృష్ణ కోరిక తీరడం అంత కష్టమైన పనేమీ కాదు. రమ్య కృష్ణ ప్రస్తుతం దర్శకుడు కృష్ణ వంశీ తెరకెక్కిస్తున్న రంగమార్తాండ మూవీలో ఓ కీలక రోల్ చేస్తున్నారు. అలాగే పూరి కొడుకు ఆకాష్ పూరి హీరోగా తెరకెక్కుతున్న రొమాంటిక్ మూవీలో కూడా రమ్య కృష్ణ ప్రాధాన్యం ఉన్న పాత్రలో కనిపిస్తున్నారు.