‘ఇస్మార్ట్ శంకర్’ తర్వాత రామ్ హీరోగా చేస్తున్న సినిమా ‘రెడ్’. కాగా ఈ సినిమా కోసం ఓ డిజిటల్ ఓటిటి ప్లాట్ ఫామ్ భారీ మొత్తాన్ని ఆఫర్ చేసిందట, డైరెక్ట్ గా డిజిటల్ లో రిలీజ్ చేయటానికి. కానీ చిత్రబృందం ఆ ఆఫర్ ను రిజెక్ట్ చేసింది. డైరెక్ట్ గా థియేటర్స్ లోనే రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. కరోనా ప్రభావం తగ్గితే.. జూన్ 19న విడుదల చేయాలని మేకర్స్ యోచిస్తున్నారట.
ఇక ఈ సినిమాలో బ్యూటీ హెబ్బా పటేల్ సెకెండ్ హాఫ్ లో వచ్చే ఒక స్పెషల్ సాంగ్ లో కనిపించనుంది. తిరుమల కిషోర్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతుంది. శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో రామ్ సరసన నివేదా పేతురాజ్ నటిస్తోంది. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తుండగా సమీర్ రెడ్డి ఛాయాగ్రహణం అందిస్తున్నారు.
ఏమైనా కరోనా మహమ్మారి రాకతో సినిమాల రిలీజ్ డేట్లు అతలాకుతలం అయిపోయాయి. ఏ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో కూడా తెలియకుండా పోయింది. మొత్తానికి కరోనా సినిమాలకు కూడా బాగానే నష్టం చేస్తోంది.