రజినీ సినిమాకు కూడా బ్రేక్.!

రజినీ సినిమాకు కూడా బ్రేక్.!

Published on Jun 19, 2020 11:24 PM IST

తమిళ్ తలైవర్ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం “దర్బార్”. ఏ ఆర్ మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రం పలు చోట్ల ఊహించిన స్థాయి విజయాన్ని అందుకోలేకపోయింది. అయినప్పటికీ మంచి వసూళ్లనే ఈ చిత్రం రాబట్టింది.

అయితే దీని తర్వాతే మళ్ళీ వెంటనే అక్కడి స్టార్ డైరెక్టర్ శివతో “అన్నాతే” అనే ఒక సినిమాను కూడ మొదలు పెట్టి సెన్సేషన్ రేపారు. అలా మొదలు పెట్టినప్పుడే ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో ఉంచుతామని ప్రకటించేసారు.

ఇప్పుడు లాక్ డౌన్ పడ్డప్పటికీ షూట్ చాలా వరకు అయినా అనుకున్న సమయానికి ఈ చిత్రం వచ్చే అవకాశాలు ఉన్నాయని టాక్ వినిపించింది. కానీ లేటెస్ట్ గా వినిపిస్తున్న సమాచారం ప్రకారం రజినీ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి బరి నుంచి తప్పుకున్నట్టు తెలుస్తుంది.

ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ షూటింగ్స్ స్టార్ట్ చేసినా అప్పటికి పూర్తవుతుందా లేదా అన్న సంశయంలో టీం ఉన్నారట అందుకే ఈ చిత్రాన్ని ఎలాగో కాస్త లేట్ గానే తీసుకొద్దామని అనుకుంటున్నట్టు ఇప్పుడు సమాచారం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు