తెలుగు సినిమా అప్ డేట్ ‘జేమ్స్ కామరూన్’ ద్వారా ?

తెలుగు సినిమా అప్ డేట్ ‘జేమ్స్ కామరూన్’ ద్వారా ?

Published on Oct 19, 2025 2:03 PM IST

దర్శకధీరుడు రాజమౌళి – మహేష్ బాబు సినిమాను హాలీవుడ్ స్థాయిలో నిర్మించబోతున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ గా ప్రియాంక చోప్రా నటిస్తోంది. ఈ సినిమా నవంబర్ 16న ఫస్ట్ గ్లింప్స్, టైటిల్ అప్‌డేట్ విడుదల కానుంది. హాలీవుడ్ ఈవెంట్‌లో జేమ్స్ కామరూన్ ద్వారానే ఆ అప్‌డేట్ రిలీజ్ అవుతుందని తాజాగా టాక్ వినిపిస్తోంది. ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటిస్తుండగా, పృధ్వీరాజ్ సుకుమారన్, మాధవన్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. మొత్తానికి హాలీవుడ్ ప్రమాణాలతో రూపొందిస్తున్న ఈ సినిమా భారత సినీ చరిత్రలోనే అతిపెద్ద ప్రాజెక్ట్‌గా నిలవనుంది.

కాగా ఆ మధ్య విజయేంద్రప్రసాద్‌ ఈ సినిమా కథ గురించి ఓ ఇంటర్వ్యూలో చెబుతూ.. ‘నేను, రాజమౌళి ఇద్దరం దక్షిణాఫ్రికా నవలా రచయిత విల్బర్‌ స్మిత్‌ కు పెద్ద అభిమానులం. అందుకే ఆయన పుస్తకాల ఆధారంగానే ఈ సినిమా స్క్రిప్ట్ ను రాశాను’ అంటూ చెప్పుకొచ్చారు. కాబట్టి రాజమౌళి – మహేష్ సినిమా ఒక అడ్వెంచర్ థ్రిల్లర్‌ గా ఉండబోతుంది. ఈ చిత్రానికి కీరవాణి సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. విజయేంద్రప్రసాద్‌ కథ, దేవా కట్టా సంభాషణలు అందిస్తున్నారు.

తాజా వార్తలు