టాలీవుడ్ దర్శకుడు పూరి జగన్నాధ్, తమిళ విలక్షణ నటుడు విజయ్ సేతుపతి కాంబినేషన్లో ఓ సినిమా రానున్న సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ను అనౌన్స్ చేసినదగ్గర్నుంచి ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ అయింది. ఇక ఈ సినిమాను ఎప్పుడెప్పుడు ప్రారంభిస్తారా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.
ఈ క్రమంలో ఈ చిత్రానికి సంబంధించి తాజాగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ చిత్రాన్ని గ్రాండ్గా లాంచ్ చేశారు మేకర్స్. ఇక ఈ చిత్రాన్ని పూరి జగన్నాధ్, ఛార్మి కౌర్ ‘పూరి కనెక్ట్స్’ బ్యానర్పై ప్రొడ్యూ్స్ చేస్తున్నారు. తాజాగా ఈ ప్రాజెక్ట్లోకి జెబి మోషన్ పిక్చర్స్ కూడా జాయిన్ అయింది. దీంతో పూరి కనెక్ట్స్తో కలిసి జెబి మోషన్ పిక్చర్స్పై జెబి నారాయణ రావు కొండ్రొల్ల ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేయనున్నారు.
ఇక ఈ సినిమాలో విజయ్ సేతుపతితో పాటు అందాల భామ సంయుక్త మీనన్, దునియా విజయ్, టబు తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమాను పాన్ ఇండియా భాషల్లో రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.