‘కుబేర’ క్లైమాక్స్.. విమర్శలకు చెక్ పెట్టిన శేఖర్ కమ్ముల

టాలీవుడ్‌లో రీసెంట్‌గా రిలీజ్ అయిన చిత్రం ‘కుబేర’ బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాను దర్శకుడు శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేయగా అక్కినేని నాగార్జున, ధనుష్, రష్మిక మందన్న లీడ్ రోల్స్‌లో నటించారు. ఈ సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో పాటు కొన్ని విమర్శలు కూడా వచ్చాయి. అందులో ఈ చిత్ర క్లైమాక్స్‌పై కొందరు ప్రేక్షకులు పెదవి విరిచారు.

ఈ చిత్రం క్లైమాక్స్ చాలా రొటీన్‌గా ఉందని.. సినిమా కథకు తగ్గట్లుగా వైవిధ్యమైన క్లైమాక్స్ ప్లాన్ చేసి ఉండాల్సిందని పలువురు కామెంట్ చేశారు. అయితే, ఈ విషయంపై తాజాగా శేఖర్ కమ్ముల స్పందించాడు. చాలా ఆలోచనల తర్వాత ప్రస్తుతం ఉన్న క్లైమాక్స్‌ను ఫిక్స్ చేశామని ఆయన అన్నారు. ఇక ఈ సినిమా నిడివిపై కూడా పలు విమర్శలు రాగా, సినిమా కంటెంట్ కోసం తాము నిడివి అలాగే పెట్టాల్సి వచ్చిందని శేఖర్ కమ్ముల అన్నారు.

ఇక ఈ సినిమాకు తెలుగు బాక్సాఫీస్ దగ్గర మంచి రెస్పాన్స్ రాగా, ఇతర భాషల్లో ఈ చిత్రానికి నెగెటివ్ టాక్ వచ్చింది. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించగా సునీల్ నారంగ్, పుస్కూరు రామ్ మోహన్ రావు ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేశారు.

Exit mobile version