భారత్-పాకిస్తాన్ మ్యాచ్ కోసం క్రికెట్ ప్రేమికులు ఎంతగానో ఎదురుచూశారు. మొత్తానికి మ్యాచ్ అయితే ఘనంగా ప్రారంభమైంది. ఐతే, ఈ హై వోల్టేజ్ మ్యాచ్ను సామాన్య క్రికెట్ అభిమానులే కాకుండా, మెగాస్టార్ చిరంజీవి ఆసక్తిగా వీక్షించడానికి నేరుగా స్టేడియానికి వెళ్లారు. దుబాయ్ స్టేడియంలో మ్యాచ్ను ఆస్వాదిస్తున్న చిరంజీవి దృశ్యాలు టీవీ స్క్రీన్పై పలుసార్లు కనిపించడం ఫ్యాన్స్ ను ఆకట్టుకుంది. ఈ సందర్భంగా మెగాస్టార్ అక్కడున్న వారితో ఫోటోకి ఫోజు ఇస్తూ థమ్స్ అప్ సింబల్ చూపించి నవ్వుతూ ఫోటో దిగారు. పైగా పెవిలియన్లో కూర్చొని మ్యాచ్ను ఆసక్తిగా వీక్షిస్తున్న చిరంజీవి పిక్స్ కూడా నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
మొత్తానికి ఈ మ్యాచ్ తో మెగాస్టార్ చిరంజీవి కూడా క్రికెట్ ఫ్యాన్ అని తెలిసింది. పైగా ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్ చూసేందుకు ఆయన దుబాయ్ వెళ్లడం, స్టార్ స్పోర్ట్స్ తెలుగు అఫీషియల్ సోషల్ మీడియా అకౌంట్ లో చిరు మ్యాచ్ ను చూస్తున్న ఫోటోని పోస్ట్ చేయడంతో ఈ పిక్ వైరల్ అయింది. అన్నట్టు చిరు పక్కన యంగ్ క్రికెటర్ అభిషేక్ శర్మ కూడా కూర్చుని కాసేపు మ్యాచ్ ని చూడటం ఆకట్టుకుంది. కాగా, టాస్ గెలిచిన పాకిస్తాన్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. స్లో పిచ్పై పాకిస్తాన్ బ్యాటర్లు చాలా నెమ్మదిగా ఆడుతున్నారు.