హీరో సుశాంత్ మరణం తరువాత బాలీవుడ్ లోని కొందరు వ్యక్తుల వలన ఇబ్బందులు ఎదుర్కొన్న చాల మంది నటీనటులు బయటికి వచ్చి సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తున్నారు. ఈ లిస్ట్ లో పాయల్ రాజ్ పుత్ కూడా చేరింది. టీవీ నటిగా కెరీర్ ప్రారంభించి హీరోయిన్ గా మారిన పాయల్ రాజ్ పుత్ ని బాలీవుడ్ లో కొందరు అవమానించారట. నీవు హీరోయిన్ మెటీరియల్ కాదు, పనికి రావని హేళన చేశారట. అప్పుడు తనకు చాలా బాధవేసిందని పాయల్ సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది.
ఓ పంజాబీ సినిమాతో హీరోయిన్ గా మారిన పాయల్ ఓ హిందీ చిత్రంలో నటించింది. ఆమె తెలుగులో నటించిన ఆర్ ఎక్స్ 100 సూపర్ హిట్ కావడంతో తెలుగులో ఆమె బిజీ అయ్యారు. ప్రస్తుతం తెలుగు మరియు తమిళ భాషలలో పాయల్ హీరోయిన్ గా రాణిస్తుంది.