‘పవన్-క్రిష్’ సినిమా లేటెస్ట్ అప్ డేట్ !

‘పవన్-క్రిష్’ సినిమా లేటెస్ట్ అప్ డేట్ !

Published on Feb 14, 2021 1:13 AM IST

పవన్-క్రిష్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా పవన్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ మూవీ అని, దాదాపు 170 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ సినిమాని నిర్మిస్తున్నారట. కాగా మొఘల్ కాలం నాటి ఫిక్షన్ కథతో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం అల్యూమినియం ఫ్యాక్టరీలో భారీ సెట్స్ వేసి షూట్ చేశారు. ఇక ఈ సినిమాలో పవన్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే మరో హీరోయిన్ గా జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తోంది.

కాగా ఈ సినిమాని పాన్ ఇండియన్ సినిమాగా తీసుకురానున్నారు. అందుకే క్రిష్ ఈ సినిమాకి మరింత గ్రాండ్ నెస్ ను తీసుకు వచ్చేందుకు పరభాషా నటులను కూడా తీసుకున్నారు. అలాగే పవన్ ను చూసి ఓ గిరిజిన యువతి ప్రేమలో పడుతుందని.. ఆ పాత్రలో హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ ను తీసుకోనున్నారని కూడా వార్తలు వస్తున్నాయి. ఇక ప్రముఖ నిర్మాత ఏ ఎమ్ రత్నం మొత్తానికి ఈ సినిమాని భారీగా నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు