సెన్సార్ పనులు ముగించుకున్న ‘తమ్ముడు’.. షాకిచ్చిన సెన్సార్ బోర్డ్

హీరో నితిన్ నటించిన లేటెస్ట్ మూవీ ‘తమ్ముడు’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ చేసింది. ఈ సినిమాను దర్శకుడు శ్రీరామ్ వేణు డైరెక్ట్ చేస్తుండగా పూర్తి ఎమోషనల్ యాక్షన్ డ్రామాగా ఈ మూవీ రూపొందించారు. ఇక ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ ప్రేక్షకుల్లో ఈ సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేశాయి.

తాజాగా ఈ సినిమా సెన్సార్ పనులు కూడా ముగించుకుంది. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డ్ ‘ఏ’ సర్టిఫికెట్ జారీ చేసింది. దీంతో ప్రేక్షకులు ఒకింత ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ సినిమాలో అక్క, తమ్ముడు మధ్య ఎమోషనల్ కంటెంట్ ఉన్నప్పటికీ ఇలాంటి సినిమాకు ఏ సర్టిఫికెట్ రావడం ఏమిటని పలువురు కామెంట్ చేస్తున్నారు.

ఇక ఈ సినిమాలో నటి లయ రీ-ఎంట్రీ ఇస్తుండగా అందాల భామలు సప్తమి గౌడ, వర్ష బొల్లమ్మ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తున్నారు. దిల్ రాజు, శిరీష్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమా జూలై 4న గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అయింది.

Exit mobile version