అప్పుడు బాబాయ్ ఇప్పుడు అబ్బాయి అంటున్న నయనతార

అప్పుడు బాబాయ్ ఇప్పుడు అబ్బాయి అంటున్న నయనతార

Published on Oct 9, 2012 4:10 PM IST


“శ్రీ రామ రాజ్యం” చిత్రంతో తెరకు దూరమయిన నయనతార చాలా కాలం విరామం తరువాత “కృష్ణం వందే జగద్గురుం” చిత్రంతో తిరిగి తెర మీద కనపడనున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం కోసం ఆమె ప్రత్యేకంగా శ్రద్ద చూపుతున్నట్లు సమాచారం. రానా ప్రధాన పాత్రలలో వస్తున్న ఈ చిత్రంలో నయనతార లఘు చిత్రాలను తీసే యువతీ పాత్రలో కనిపించనున్నారు. క్రిష్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు ఆడియో ఆవిష్కరణ కార్యక్రమంలో తను ఈ చిత్రానికి తొలిసారిగా డబ్బింగ్ చెప్పానని నయనతార వెల్లడించారు అంతే కాకుండా నయనతార నటన గురించి క్రిష్ ఆమెను ప్రశంసలలో ముంచెత్తారు. “నా తొలి తెలుగు చిత్రం వెంకటేష్ గారి సరసన చేస్తున్న ప్రస్తుతం కం బ్యాక్ చిత్రం రానాతో చేస్తున్నాను” అని గుర్తు చేశారు ఈ చిత్ర ట్రైలర్ కి అద్భుతమయిన స్పందన కనిపించింది. “గమ్యం” మరియు “వేదం” చిత్రాల తరువాత క్రిష్ చేస్తున్న మూడవ చిత్రం ఇది. మణిశర్మ సంగీతం అందించగా సాయి బాబా జాగర్లమూడి మరియు వై రాజీవ్ రెడ్డి సంయుక్తంగా నిర్మించారు.

తాజా వార్తలు