సూపర్ స్టార్ మహేష్ బాబు తన ప్రొడక్షన్ కంపెనీలో తన సినిమాలనే కాకుండా బయట హీరోలతో కూడా సినిమాలను ప్రొడ్యూస్ చేస్తున్నాడు. ఇప్పటికే అడవి శేష్ హీరోగా వస్తోన్న ‘మేజర్’ సినిమాని నిర్మిస్తూనే మరో యంగ్ హీరోతో కూడా ఓ కామెడీ ఎంటర్ టైనర్ ను ప్లాన్ చేస్తున్నాడని.. ఈ సినిమాలో యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి హీరోగా నటించబోతున్నాడని ఇప్పటికే వార్తలు వచ్చాయి. మేజర్ రిలీజ్ తరువాత ఈ సినిమా మొదలు అవుతుందట.
ఇక ‘ఏజెంట్ సాయిశ్రీనివాస ఆత్రేయ’ సినిమాతో వెండితెర పై హీరోగా ఎంట్రీ ఇచ్చి.. తనకంటూ ఓ ప్రత్యేకమైన కామెడీ టైమింగ్ ఉందని నిరూపించుకున్న నవీన్ మొదటి సినిమాతోనే మంచి హిట్ ను సొంతం చేసుకున్నాడు. అందుకే తన ప్రొడక్షన్ లో నవీన్ తో ఓ సినిమా చేయాలని మహేష్ ప్లాన్ చేస్తున్నాడట. ఈ సినిమాకి కొత్త దర్శకుడు దర్శకత్వం వహించబోతున్నట్లు తెలుస్తోంది. నవీన్ లేటెస్ట్గా జాతిరత్నాలు అనే కామెడీ ఎంటర్టైనర్ సినిమా కూడా చేస్తున్నాడు.
ఇక ఏఎంబీ సినిమాస్ మల్టీప్లెక్స్ తో థియేటర్స్ బిజినెస్ ను కూడా సమర్ధవంతంగా హ్యాండిల్ చేస్తూ.. మహేష్ పర్ఫెక్ట్ యాక్టర్ తో పాటు పర్ఫెక్ట్ బిజినెస్ మ్యాన్ గా కూడా రాణిస్తున్నాడు.