నవంబర్ చివర్లో రానున్న నవదీప్ మైత్రి

నవంబర్ చివర్లో రానున్న నవదీప్ మైత్రి

Published on Nov 21, 2012 11:00 PM IST

యంగ్ హీరో నవదీప్, సదా ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ‘మైత్రి’. ఈ సినిమాని నవంబర్ 30న విడుదల చేయనున్నారు. ఈ సినిమాలో పగటి పూట అందరితో సరదాగా ఉండే సదా రాత్రి పూట అందరినీ భయపెట్టే విధంగా ప్రవర్తిస్తూ ఉంటుంది. అలా తనలో అనుకోని మార్పులు ఎందుకు వస్తున్నాయి అనేదే ఈ చిత్ర కథాంశం. హను సినీ క్రియేషన్స్ బ్యానర్ పై రాజేష్ కుమార్ నిర్మిస్తున్న ఈ సినిమాకి సూర్య రాజు దర్శకత్వం వహించారు. వికాస్ సంగీతమా అందించిన ఈ చిత్రంలో బ్రహ్మానందం, ఉత్తేజ్, చిత్రం శీను మరియు సత్యం రాజేష్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం నవదీప్ ఈ సినిమా కాకుండా ‘వసూల్ రాజా’, ‘బంగారు కోడిపెట్ట’ మరియు ‘పొగ’ సినిమాల్లో నటిస్తున్నారు. అలాగే ఎన్.టి.ఆర్ హీరోగా రానున్న ‘బాద్షా’ చిత్రంలో కూడా ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. తెలుగులో చాలా కాలంగా సరైన హిట్ లేక డీలా పడిన సదాకి ఈ సినిమాతో నవదీప్ అన్నా హిట్ ఇస్తాడేమో చూడాలి.

తాజా వార్తలు